విజయ్ సేతుపతి ఏస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మే 23న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. అదే రోజు ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ను ఇటీవల అఫీషియల్గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఏస్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్కుమార్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు. అరుముగకుమార్ దర్శకత్వం వహిస్తూ స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
ఏస్ మూవీ షూటింగ్ మొత్తం మలేషియాలోనే జరిగింది. లొకేషన్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతోన్నారు. గ్రిప్పింగ్ యాక్షన్ మూవీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియెన్స్కు ఈ మూవీ థ్రిల్లింగ్ను పంచుతుందని మేకర్స్ పేర్కొన్నారు.
విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న 51వ మూవీ ఇది. 2023లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఏస్ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేస్తున్నారు. సామ్ సి.ఎస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తోన్నారు.
విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళంలో ఏస్, ట్రైన్తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీకి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించబోతున్నది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తోన్నారు. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ కన్ఫామ్ అయినట్లు తెలిసింది.
విజయ్ సేతుపతి మహారాజా మూవీ 2024లో అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన తమిళ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 20 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 190 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తెలుగులో రిలీజైన ఈ మూవీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
సంబంధిత కథనం