ఓ బిర్యానీ తిని నిద్రపోతే అంతా సెట్ అవుతుంది.. తల కాస్త నొప్పిగా ఉంది: యాక్సిడెంట్ తర్వాత విజయ్ ట్వీట్ వైరల్-vijay deverakonda tweets after car accident says a biryani and sleep will fix everything his head hurts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓ బిర్యానీ తిని నిద్రపోతే అంతా సెట్ అవుతుంది.. తల కాస్త నొప్పిగా ఉంది: యాక్సిడెంట్ తర్వాత విజయ్ ట్వీట్ వైరల్

ఓ బిర్యానీ తిని నిద్రపోతే అంతా సెట్ అవుతుంది.. తల కాస్త నొప్పిగా ఉంది: యాక్సిడెంట్ తర్వాత విజయ్ ట్వీట్ వైరల్

Hari Prasad S HT Telugu

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం తర్వాత తొలిసారి ఎక్స్ ద్వారా స్పందించాడు. తన తల నొప్పిగా ఉందని, అయితే బిర్యానీ తిని నిద్రపోతే అంతా సెట్ అవుతుందని తనదైన స్టైల్లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఓ బిర్యానీ తిని నిద్రపోతే అంతా సెట్ అవుతుంది.. తల కాస్త నొప్పిగా ఉంది: యాక్సిడెంట్ తర్వాత విజయ్ ట్వీట్ వైరల్

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం జరిగిన విషయం తెలుసు కదా. దీనిపై అతడు అధికారికంగా స్పందించాడు. సోమవారం (అక్టోబర్ 6) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి సమీపంలో జరిగిన ఒక ప్రమాదం నుంచి ఈ నటుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై విజయ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించాడు. తాను బాగానే ఉన్నానని, అభిమానులు 'టెన్షన్ పడొద్దు' అని చెప్పాడు.

కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ప్రకటన

సోమవారం (అక్టోబర్ 6) సాయంత్రం విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు. దీంతో అతడు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎక్స్ ద్వారా స్పందించాడు. "అంతా బాగానే ఉంది. కారుకు ప్రమాదం జరిగింది. కానీ మేమంతా బాగానే ఉన్నాము. వెళ్లి ఒక స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా చేశాను. ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను.

నా తల కొంచెం నొప్పిగా ఉంది. కానీ బిర్యానీ, నిద్ర ఫిక్స్ చేయనది ఏముంటుంది చెప్పండి. కాబట్టి మీ అందరికీ పెద్ద హగ్స్. నా లవ్. ఈ వార్త మిమ్మల్ని టెన్షన్ పెట్టకుండా చూసుకోండి" అని ట్వీట్ చేశాడు. కారు ప్రమాదం జరిగిన సమయంలో విజయ్ వాహనంలోనే ఉన్నాడు. కానీ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.

రష్మికతో నిశ్చితార్థం తర్వాత పుట్టపర్తి సందర్శన

నటి రష్మిక మందన్నతో నిశ్చితార్థం వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన కొద్ది రోజుల తర్వాత.. విజయ్ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించారు. ఈ నిశ్చితార్థం వార్తను వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.

ఎక్స్ లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి లతో కలిసి కనిపించాడు. పుట్టపర్తి మేనేజ్‌మెంట్ ఆయనకు స్వాగతం పలికి సత్యసాయిబాబా చిత్రపటాన్ని, ఒక పూలగుచ్ఛాన్ని అందజేసి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అభిమానుల దృష్టి విజయ్ పెట్టుకున్న నిశ్చితార్థపు ఉంగరం పైనే పడింది.

విజయ్ రష్మిక 2018లో వచ్చిన 'గీత గోవిందం' లో కలిసి పనిచేసినప్పటి నుండి డేటింగ్‌లో ఉన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. 'డియర్ కామ్రేడ్' చిత్రంలో కూడా వారు కలిసి నటించారు. 2023లో వారు మాల్దీవుల్లో కలిసి వెకేషన్‌లో ఉన్నారని అభిమానులు గుర్తించడంతో వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వదంతులు మరింత పెరిగాయి. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ చివరిగా 'కింగ్డమ్' సినిమాలో కనిపించాడు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం