Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరో-vijay deverakonda at maha kumbhmela prayag raj with his mother shared photos on instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరో

Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరో

Hari Prasad S HT Telugu

Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాకు వెళ్లాడు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అక్కడి త్రివేణీ సంగమంలో స్నానం చేశాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు.

మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. త్రివేణీ సంగమంలో స్నానం

Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో ఇప్పటికే 50 కోట్లకుపైగా జనం పుణ్య స్నానాలు ఆచరించిన విషయం తెలుసు కదా. తాజాగా రౌడీ బాయ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తన తల్లి, స్నేహితులతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లాడు. అక్కడి త్రివేణీ సంగమంలో భక్తిగా స్నానం చేశాడు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో అతడు షేర్ చేశాడు.

కుంభమేళాలో విజయ్ దేవరకొండ

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళా ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నం కూడా. కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తుంటారు. ఈ సారి మహాకుంభ్ 2025 లో బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన తల్లి మాధవితో కలిసి గంగానదిలో స్నానమాచరించారు. తన మహాకుంభ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోల్లో నటుడు తన తల్లి, ఇతర స్నేహితులతో కనిపించాడు.

కాశీ విశ్వనాథుడినీ దర్శించుకున్న విజయ్

విజయ్ దేవరకొండ ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "2025 కుంభమేళా.. మన పురాణాలు, మూలాలను గౌరవించడం, వాటితో కనెక్ట్ అయ్యే ఓ ప్రయాణం. నా భారతీయ స్నేహితులతో జ్ఞాపకాలను ఏర్పరచుకుంటున్నాను. అమ్మతో కలిసి పూజలు చేశాను. తర్వాత కాశీని కూడా దర్శించుకున్నాం " అనే క్యాప్షన్ ఉంచాడు.

విజయ్ తన తల్లితో కలిసి ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద గంగానదిలో స్నానం చేశాడు. ఈ సందర్భంగా విజయ్ నుదుటన కుంకుమ, ధోతీ, రుద్రాక్ష మాల ధరించాడు. అతనికి సంబంధించిన ఈ ఫొటోలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మహాకుంభ్ 2025లో పాల్గొన్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని త్రివేణీ సంగమం సందర్శనకు సంబంధించిన ఫోటోలను పంచుకోగా, రానా దగ్గుబాటి సతీమణి మిహీకా బజాజ్ నాగ సాధువులతో తన అనుభవాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. దక్షిణాది నటి శ్రీనిధి శెట్టి కూడా మహాకుంభ్ లో పాల్గొని ఇది తన జీవితంలో అమూల్యమైన అనుభవంగా అభివర్ణించారు.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కింగ్డమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే మూవీ నుంచి టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, విజయ్ యాక్షన్, అనిరుధ్ బీజీఎం ఈ టీజర్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం