ఇండియాదే కశ్మీర్.. కశ్మీరీలు మనవాళ్లే.. ప్రజలే పాక్ పై దాడి చేస్తారు: విజయ్ దేవరకొండ సంచలన కామెంట్లు-vijay devarakonda sensational comments on kashmir pahalgam terror attack pakistan at retro pre release event suriya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇండియాదే కశ్మీర్.. కశ్మీరీలు మనవాళ్లే.. ప్రజలే పాక్ పై దాడి చేస్తారు: విజయ్ దేవరకొండ సంచలన కామెంట్లు

ఇండియాదే కశ్మీర్.. కశ్మీరీలు మనవాళ్లే.. ప్రజలే పాక్ పై దాడి చేస్తారు: విజయ్ దేవరకొండ సంచలన కామెంట్లు

రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన అతను.. కశ్మీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. పాకిస్థాన్ గురించి కూడా మాట్లాడాడు.

ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్, సూర్య (x/SitharaEnts)

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో శనివారం (ఏప్రిల్ 26) రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన విజయ్ మాట్లాడుతూ.. కశ్మీర్ ఇండియాదేనని పేర్కొన్నాడు.

విజయ్ ఏమన్నాడంటే?

ఇటీవల జమ్ము కశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ మారణ కాండలో 26 మంది అమాయకులు చనిపోయారు. ఈ ఘటనతో ఊగిపోతున్న భారత్.. పాకిస్థాన్ ను టార్గెట్ చేసింది. మరోవైపు కశ్మీర్ తమదే అంటూ భారత్ ను పాక్ రెచ్చగొడుతోంది. ఈ సమయంలో విజయ్ దేవరకొండ కశ్మీర్ ఇండియాదే అంటూ కామెంట్లు చేశాడు.

‘‘ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆ పెయిన్ ను మేం దగ్గరుండి పంచుకోలేకపోయినా మేమూ ఆ నొప్పిని, కోపాన్ని ఫీలవుతున్నాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. కశ్మీర్ లో ఈ ఘటనలు జరుగుతున్నాయి. వాళ్లకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించి, బ్రెయిన్ వాష్ కాకుండా చూడాలి’’ అని విజయ్ పేర్కొన్నాడు.

పాక్ పై అటాక్

‘‘నేను చెప్తున్నా.. కశ్మీర్ ఇండియాదే. కశ్మీరీలు మనోళ్లే. నేను రెండేళ్ల క్రితం ఖుషీ కోసం కశ్మీర్ లో షూట్ చేశా. వాళ్లతో నాకు ఎంతో మంచి మెమోరీస్ ఉన్నాయి. పాకిస్థానోళ్లు వాళ్ల మనుషులను చూసుకోలేక ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో? అక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేదు.

ఇండియా పాక్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. ఇలాగే కంటిన్యూ అయితే పాకిస్థానోళ్లకే విరక్తి వచ్చి వాళ్ల గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు వీళ్లు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా చేసే పనులివి. ప్రజలుగా మనం ఒక్కటిగా కలిసి ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించాలి’’ అని విజయ్ అన్నాడు.

చిరంజీవి స్ఫూర్తితోనే

మెగా స్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే అగరం ఫౌండేషన్ స్టార్ట్ చేసి విద్యార్థులకు సాయం చేస్తున్నామని సూర్య వెల్లడించాడు. మే 1న నాని ‘హిట్ 3’ మూవీ కూడా రిలీజ్ అవుతోందని, అది కూడా విజయం సాధించాలని సూర్య ఆకాంక్షించాడు. సూర్య కొత్త ఫిల్మ్ ‘రెట్రో’ మే 1న రిలీజ్ కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైైరెక్ట్ చేసిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. తమిళం, తెలుగు భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం