Telugu Serial: త్వ‌ర‌లో ఈటీవీలోకి ఏడు కొత్త సీరియ‌ల్స్ - టైటిల్స్ ఇవే - టెలికాస్ట్ ఎప్పుడంటే?-veyi subhamulu kalugu neeku to shirdi sai upcoming telugu tv serials in etv channel cast and crew telecast details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Serial: త్వ‌ర‌లో ఈటీవీలోకి ఏడు కొత్త సీరియ‌ల్స్ - టైటిల్స్ ఇవే - టెలికాస్ట్ ఎప్పుడంటే?

Telugu Serial: త్వ‌ర‌లో ఈటీవీలోకి ఏడు కొత్త సీరియ‌ల్స్ - టైటిల్స్ ఇవే - టెలికాస్ట్ ఎప్పుడంటే?

Nelki Naresh HT Telugu

Telugu Serial: త్వ‌ర‌లో ఈటీవీలో ఏడు కొత్త సీరియ‌ల్స్ లాంఛ్ కాబోతున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఫాంట‌సీ, డివోష‌న‌ల్ క‌థాంశాల‌తో తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్స్ టైటిల్స్‌ను ఈటీవీ రివీల్ చేసింది. ఈ సీరియ‌ల్స్ టెలికాస్ట్ అయ్యేది ఎప్పుడంటే?

తెలుగు సీరియల్

Telugu Serial: పాత సీరియ‌ల్స్‌కు ఒక్కొక్క‌టిగా గుడ్‌బై చెబుతోన్న ఈటీవీ ఒకేసారి ఏడు కొత్త సీరియ‌ల్స్‌తో బుల్లితెర ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. డివోష‌న‌ల్‌, ఫ్యామిలీ డ్రామా, ఫాంట‌సీ...ఇలా డిఫ‌రెంట్ జాన‌ర్స్‌తో ఈ సీరియ‌ల్ తెర‌కెక్కుతోన్నాయి. ఈ సీరియ‌ల్స్ టైటిల్స్ రివీల‌య్యాయి.

వేయి శుభ‌ములు క‌లుగు నీకు...

ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న వేయి శుభ‌ములు క‌లుగు నీకు సీరియ‌ల్ త్వ‌ర‌లో ఈటీవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సీరియ‌ల్‌లో మౌనిక‌రెడ్డి, శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, వీజే సంయుక్త‌, శ్వేత, జ్యోతి గౌడ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

న‌లుగురు అక్కాచెల్లెళ్లు...

వేయి శుభ‌ములు క‌లుగు నీకు సీరియ‌ల్ ప్రోమోను ఇటీవ‌ల‌ మేక‌ర్స్ రిలీజ్ చేశారు. వారాహి, క‌ళ్యాణి, హాసిని, సునైన అనే న‌లుగురు అక్కాచెలెళ్ల క‌థ‌తో ఈ సీరియ‌ల్ రూపొందుతోన్న‌ట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోలో కృష్ణ‌మ్మ‌గా త‌ల్లి పాత్ర‌లో శిల్పా చ‌క్ర‌వ‌ర్తి క‌నిపించ‌గా...ఆమె కూతుళ్లుగా మౌనిక‌రెడ్డి, వీజే సంయుక్త‌, శ్వేత‌, జ్యోతి గౌడ క్యారెక్ట‌ర్స్‌ను ప‌రిచ‌యం చేశారు. ఏప్రిల్‌లో ఈ సీరియ‌ల్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. జ్ఞాపిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ఈ సీరియ‌ల్‌ను నిర్మిస్తోంది.

వ‌సుంధ‌ర‌...

వ‌సుంధ‌ర పేరుతో ఈటీవీలోకి మ‌రో కొత్త సీరియ‌ల్ రాబోతోంది. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్‌ను లాంఛ్ చేశారు. ఊర్వ‌శివో రాక్ష‌సివో, గీతా ఎల్ఎల్‌బీ సీరియ‌ల్స్‌ను నిర్మించిన పోలూరు శ్రీకాంత్ వ‌సుంధ‌ర సీరియ‌ల్‌ను నిర్మిస్తోన్నారు.

మెరుపు కల‌లు...

ర‌క్ష నింభార్గి ప్ర‌ధాన పాత్ర‌లో మెరుపు క‌ల‌లు పేరుతో ఓ తెలుగు సీరియ‌ల్ రాబోతోంది. ఈ సీరియ‌ల్ ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.

షిరిడి సాయి...

డివోష‌న‌ల్ క‌థాంశంతో రూపొందుతోన్న షిరిడిసాయి కూడా ఈటీవీ ద్వారానే బుల్లితెర అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది. సాయిబాబా మ‌హిమ‌ల‌తో ఈ సీరియ‌ల్ తెర‌కెక్కుతోంది. షిరిడిసాయితో పాటు భ‌క్తి ప్ర‌ధానంగా రూపొందిన ఆది ప‌రాశ‌క్తి, శ్రీ రాఘ‌వేంద్ర మ‌హిమ‌లు కూడా ఈటీవీలోనే రిలీజ్ కానున్నాయి.

తార‌...

ఫాంట‌సీ ల‌వ్ డ్రామాగా రూపొందిన తారా సీరియ‌ల్ త్వ‌ర‌లోనే టెలికాస్ట్ కానున్న‌ట్లు ఈటీవీ ప్ర‌క‌టించింది. హిందీలో విజ‌య‌వంత‌మైన ధృవ్‌తార సీరియ‌ల్‌కు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌గా తార రాబోతోంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం