Vennela Kishore Turns In To Anchor: తెలుగులో మరో కొత్త టాక్ షో - యాంకర్గా ఎంట్రీ ఇస్తోన్న స్టార్ కమెడియన్
Vennela Kishore Turns In To Anchor: టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ యాంకర్గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోన్నారు. అతడు యాంకర్గా అలా మొదలైంది పేరుతో ఓ టాక్షో ప్రారంభంకానుంది. ఈ షో ఏ ఛానెల్లో టెలికాస్ట్ కానుందంటే...
Vennela Kishore Turns In To Anchor: తెలుగులో ప్రస్తుతం టాక్షోల హవా నడుస్తోంది. సెలబ్రిటీ టాక్షోలలో బాలకృష్ణ అన్స్టాపబుల్ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది. దాంతో బాలకృష్ణ బాటలో అడుగులు వేసేందుకు పలువురు స్టార్స్ రెడీ అవుతోన్నారు. హోస్ట్లుగా మారుతోన్నారు. తాజాగా తెలుగులో మరో కొత్త టాక్షో ప్రారంభంకాబోతున్నది.
అలా మొదలైంది పేరుతో రూపొందుతోన్న ఈ టాక్ షోకు టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ యాంకర్గా వ్యవహరించబోతున్నాడు. ఈ టాక్షోతోనే యాంకర్గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వెన్నెలకిషోర్.
ఈటీవీలో ఈ టాక్షో ప్రసారం కానుంది. అలా మొదలైంది షోను ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. త్వరలోనే అలా మొదలైంది షో ఈటీవీలో టెలికాస్ట్ కానున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.
సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీల జర్నీ ఎలా ఆరంభమైందో ఈ షో ద్వారా వెన్నెల కిషోర్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఈ షోలో పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలతో పాటుసెలబ్రిటీలు పాలు పంచుకోనున్నట్లు సమాచారం. వారు ఎవరన్నది త్వరలోనే తేలనుంది. ఈ షోకు యాంకర్గా వ్యవహరించేందుకు వెన్నెల కిషోర్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.