మీడియానే వక్రీకరించిందంటా.. వివాదాస్పద గుడి వ్యాఖ్యలపై ఊర్వశి రౌటేలా వింత వాదన-urvashi rautelas bizarre claim media misrepresented my temple remarks ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మీడియానే వక్రీకరించిందంటా.. వివాదాస్పద గుడి వ్యాఖ్యలపై ఊర్వశి రౌటేలా వింత వాదన

మీడియానే వక్రీకరించిందంటా.. వివాదాస్పద గుడి వ్యాఖ్యలపై ఊర్వశి రౌటేలా వింత వాదన

ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఆలయం ఉందని ఉర్వశి రౌటేలా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆమె పేర్కొనడం గమనార్హం.

ఊర్వశి రౌటేలా

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్వశి రౌటేలా.. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఆలయం ఉందని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. నెటిజన్లు, పూజారులు, మత గురువులు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో ఈ వివాదంపై వెనక్కి తగ్గని ఊర్వశి ఇప్పుడు వింతైన వాదన చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.

ఊర్వశి ఏం చెప్పిందటే?

తన పేరు మీద గుడి ఉందనే బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌటేలా కామెంట్లు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆమె కోట్స్ తో ఊర్వశి టీమ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

"ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఆలయం ఉందని చెప్పా. కానీ అది ఉర్వశి రౌటేలా ఆలయం కాదు. ప్రజలు సరిగ్గా వినరు. ‘ఉర్వశి’ లేదా ‘ఆలయం’ అనే మాటలు వినగానే, ప్రజలు ఉర్వశి రౌటేలాను పూజిస్తున్నారని అనుకుంటున్నారు. ఈ వీడియోను సరిగ్గా విని ఆ తర్వాత మాట్లాడండి’’ అని ఆ ప్రకటనలో తెలిపారు.

మీడియాపై రుసరుస

ఏదైనా ఆరోపణలు చేసేముందు వాస్తవాలను ధృవీకరించాలని ఊర్వశి రౌటేలా చెప్పింది. మీడియా తన మాటలను వక్రీకరిచిందనేలా ఆమె మాట్లాడింది. “ఎవరినైనా అవమానించేలా లేదా నిరాధార ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పూర్తిగా ధృవీకరించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి హక్కులను కాపాడటానికి సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా, అవగాహనతో వ్యవహరించాలి” అని ఆ ప్రకటన లో పేర్కొన్నారు. .

ఆ కామెంట్లు వైరల్

సిద్ధార్థ్ కన్నన్‌తో ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఒక ఆలయం ఉందని, అది బద్రీనాథ్ ఆలయం పక్కనే ఉందని చెప్పింది. “ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఒక ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు వెళితే, దాని పక్కనే ‘ఉర్వశి ఆలయం’ ఉంటుంది” అని చెప్పింది. ప్రజలు ఆ ఆలయానికి దీవెనలు తీసుకోవడానికి వెళతారా అని హోస్ట్ అడిగినప్పుడు.. ఉర్వశి నవ్వి, “ఆలయం ఉంటే అదే చేస్తారు” అని సమాధానం చెప్పింది.

అయితే, ఆ ఆలయాన్ని పవిత్రంగా భావించే పూజారులు, స్థానికులు ఊర్వశి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మత భావాలను దెబ్బతీసిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఊర్వశి ఆలయాన్ని 108 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం, సతీ దేవి శరీరం పడిన ప్రదేశంలో ఆ ఆలయం ఏర్పడింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం