Urvashi Special Song in Waltair Veerayya: మెగాస్టార్‌తో ఆ బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక గీతం.. ఎవరో తెలుసా?-urvashi rautela special song with megastar chiranjeevi in waltair veerayya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Urvashi Rautela Special Song With Megastar Chiranjeevi In Waltair Veerayya

Urvashi Special Song in Waltair Veerayya: మెగాస్టార్‌తో ఆ బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక గీతం.. ఎవరో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Nov 04, 2022 04:25 PM IST

Urvashi Special Song in Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా నటించనున్నట్లు సమాచారం.

వాల్తేరు వీరయ్య చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం
వాల్తేరు వీరయ్య చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం

Urvashi Special Song in Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మాస్ లుక్‌తో మన మెగాస్టార్ అదరగొట్టారు. ఎప్పుడో ముఠామేస్తీ సినిమాతో ఆయన లుక్‌‍ను తాజాగా ఈ సినిమాతోనూ గుర్తుకుతెచ్చారు. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి.. మాస్ మహారాజాకు ఓ ప్రత్యేక గీతం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవలే ఈ పాటను హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో పూర్తి కూడా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది.

ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్ కూడా ఉండనుందట. ఈ ప్రత్యేకగీతంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా నర్తించనున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీ సెట్‌ను చిత్రబృందం నిర్మించిందట. ఈ అదిరిపోయే ప్రత్యేక గీతానికి దేవిశ్రీ ప్రసాద్ తన దైన మ్యూజిక్‌తో ఊపు తెప్పించనున్నాడని, ప్రేక్షకులను మరోసారి ఉర్రూతలూగించినున్నారని అనుకుంటున్నారు.

ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ నృత్యాలను సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఊర్వశి అందాలకు తోడు.. దేవిశ్రీపసాద్ మ్యూజిక్.. మెగాస్టార్ స్టెప్పులు తోడవ్వడంతో సినిమాలో ఇది దుమ్మురేపుతోందని అంచనాలు వేసుకుంటున్నారు.

బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలిసారిగా చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం