తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనంతపురం బ్యూటి సుమయ రెడ్డి. కథానాయికగా, నిర్మాతగా, రచయితగా సుమయ రెడ్డి చేసిన సినిమా డియర్ ఉమ. పృథ్వీ అంబర్ హీరోగా చేసిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమా రిలీజ్కు ముందు జరిగిన డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ సుమయ రెడ్డి తల్లి జ్యోతి రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరోయిన్ తల్లి జ్యోతి రెడ్డి మాట్లాడుతూ .. "నా కూతురు సుమయ రెడ్డి తీసిన డియర్ ఉమ చాలా బాగా వచ్చింది. హీరోయిన్, ప్రొడ్యూసర్, రైటర్ అయిన సుమయ రెడ్డి నాకు రోల్ మోడల్. పదేళ్ల నుంచి కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎవరి కోసమో ఎదురుచూడకుండా కష్టపడి పైకి వచ్చింది. డియర్ ఉమ సినిమాను ఏప్రిల్ 18న అందరూ చూడండి" అని అన్నారు.
ఇదే డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్ సాయి చంద్రారెడ్డి మాట్లాడుతూ.. "మా అక్క సుమయ రెడ్డి డియర్ ఉమ అనే మంచి సందేశాత్మక చిత్రాన్ని తీశారు. ఇలాంటి గొప్ప చిత్రాలు ఈ మధ్య రావడం లేదు. ఇంత మంచి ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది" అని తెలిపారు.
అలాగే, లైన్ ప్రొడ్యూసర్ నగేష్ మాట్లాడుతూ.. "సుమయ రెడ్డి నాకు మంచి స్నేహితురాలు. తన డ్రీమ్స్ గురించి, తన స్టోరీ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. డియర్ ఉమ చిత్రం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఇంత మంచి చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి" అని కోరారు.
లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ.. "డియర్ ఉమ చిత్రంలో మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. సెల్ఫ్ మోటివ్ చేసుకునేలా పాటను రాసే ఛాన్స్ వచ్చింది. రదన్ గారి సంగీతం, కార్తీక్ గారి గాత్రం అందించడం ఆనందంగా ఉంది " అని వెల్లడించారు.
"ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలని నిర్మాత సుమయ రెడ్డి గారు, దర్శకుడు రాజేష్ గారు ఈ చిత్రాన్ని తీశారు. డియర్ ఉమ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి" అని డియర్ ఉమ పాటల రచయిత పూర్ణాచారి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన డియర్ ఉమ సినిమాకు రెస్పాన్స్ పర్వాలేదని తెలుస్తోంది. అయితే, ఇటీవల కాలంలో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపడం లేదు. దీంతో డియర్ ఉమ బాక్సాఫీస్ కలెక్షన్స్ అంతతంమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం