Puri Movie with Salman: సల్మాన్‌తో పూరి జగన్నాథ్ మూవీ.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు..!-tollywood director puri jagannadh planning movie with salman khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Director Puri Jagannadh Planning Movie With Salman Khan

Puri Movie with Salman: సల్మాన్‌తో పూరి జగన్నాథ్ మూవీ.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు..!

Maragani Govardhan HT Telugu
Dec 20, 2022 09:00 AM IST

Puri Movie with Salman: లైగర్ ఫ్లాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో తీయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఆయన కథ చెప్పినట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్‌తో పూరి జగన్నాథ్ మూవీ
సల్మాన్ ఖాన్‌తో పూరి జగన్నాథ్ మూవీ

Puri Movie with Salman: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. చాలా కాలం గ్యాప్ తర్వాత తీసిన లైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజై ఫ్లాప్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో పూరి జగన్నాథ్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పరాజయం నుంచి కోలుకుని తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించాడు. టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం ఆయన తన తదపరి చిత్రాన్ని బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో తీయాలని అనుకుంటున్నారని సమాచారం.

సల్మాన్‌తో పనిచేసేందుకు పూరి జగన్నాథ్ ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే బాలీవుడ్ స్టార్‌కు పూరి కథను వినిపించారని, దీంతో సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నారని టాక్. అయితే ఈ విషయంపై ఇంతవరకు అధికారిక సమాచారం రాలేదు. అయితే సల్మాన్ ఖాన్‌తో పూరి జగన్నాథ్ సినిమాపై అభిమానుల మాత్రం అంచనాలు భారీగా పెంచేసుకుంటున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పనిచేయాలని సల్మాన్ ఖాన్ చాలా కాలం నుంచి అనుకుంటున్నారట. పోకిరీ రీమేక్‌గా వచ్చిన వాంటెడ్(2009) సినిమా అప్పటి నుంచి పూరితో సల్మాన్ నటించాలని చూస్తున్నారట. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పూరి కథలపై సల్మాన్ ఆసక్తికనబరుస్తున్నారట. దీంతో ఆయనతో సినిమా చేయడానికి సల్మాన్ సుముఖత వ్యక్తం చేశారని టాక్. వాంటెడ్ పూరి కథే కావడం వల్ల.. ఈ సారి రీమేక్‌లో కాకుండా ఫ్రెష్ స్క్రిప్టుతో వీరి కాంబో రానుందట.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు పూరి జగన్నాథ్ అతిథి పాత్రలో మెరవడం ఇక్కడ ఆసక్తికరం. లైగర్ ఫ్లాపుతో డీలా పడిన పూరి.. సల్మాన్‌ కోసం అదిరిపోయే స్టోరీని సిద్ధం చేశారట.

రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్ సినిమాలో అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ కూడా అతిథి పాత్రలో మెరిశారు. అనన్యా పాండే హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇటీవలే ఈ చిత్ర దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, మరో నిర్మాత చార్మీ, హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ చేపట్టింది. లైగర్ పెట్టుబడుల మూలం గురించి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిన విదేశాల నుంచి సినిమా నిర్మాణానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చాయనే ఆరోపణలపై వీరిని ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం