ఓటీటీలోకి ఇవాళ వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక మర్డర్.. 9 మంది అనుమానితులు.. ఇక్కడ చూసేయండి-thriller web series chhal kapat review zee5 ott streaming this murder mystery from today 6th june ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఇవాళ వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక మర్డర్.. 9 మంది అనుమానితులు.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక మర్డర్.. 9 మంది అనుమానితులు.. ఇక్కడ చూసేయండి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి శుక్రవారం (జూన్ 6) ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒక హత్య, దాని చుట్టూ 9 మంది అనుమానితులు.. చివరికి ఈ కేసును ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా పరిష్కరిస్తుందన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒక మర్డర్.. 9 మంది అనుమానితులు.. ఇక్కడ చూసేయండి

ఈ వీకెండ్ మంచి మర్డర్ మిస్టరీ చూడాలనుకుంటున్నారా? అయితే శుక్రవారం (జూన్ 6) జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ మిస్ కావద్దు. మరీ అంత థ్రిల్ పంచకపోయినా.. హత్య ఎవరు చేశారన్న సస్పెన్స్ మాత్రం మొదటి నుంచీ చివరి వరకూ కొనసాగుతుంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ఛల్ కపట్ (Chhal Kapat).

ఛల్ కపట్ వెబ్ సిరీస్ స్టోరీ ఇదీ..

ఛల్ కపట్ ఓ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనర్థం మోసం అని. ఇది మధ్యప్రదేశ్ లోని బురాన్‌పూర్ అనే ఊళ్లో జరిగే కథ. అలీషా, షాలు, ఇరా, మెహక్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సిరీస్ మొదట్లోనే షాలు చనిపోయినట్లుగా చూపిస్తారు. అలీషా పెళ్లి వేడుకల కోసం వచ్చిన ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో నీటిలో మునిగి చనిపోతుంది. అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్పీ దేవికా రాథోడ్ (శ్రియా పిల్గావ్‌కర్) ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగుతుంది.

షాలూ చనిపోయిన సమయంలో 9 మంది ఆ ఇంట్లో ఉండటంతో అందరినీ అనుమానితుల జాబితాలో ఆమె చేరుస్తుంది. దీనినో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని దేవికా గమనిస్తుంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించి తన దర్యాప్తును మొదలుపెడుతుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన షాలూ హత్యలో ఆమె స్నేహితులతోపాటు ఇంట్లో వాళ్లు, ఆమె మేనేజర్, మెహక్ భర్త, మంత్రి కొడుకు అయిన విక్రమ్ చండేల్ కూడా ఉంటారు. మరి వీళ్లందరిలో నుంచి అసలు హంతకుడు ఎవరు అన్నది దేవిక ఎలా కనిపెడుతుందన్నదే ఈ ఛల్ కపట్ వెబ్ సిరీస్ స్టోరీ.

ఛల్ కపట్ ఎలా ఉందంటే?

ఛల్ కపట్ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అయితే తక్కువ బడ్జెట్ తో రూపొందడం వల్ల ఇందులో మంచి ప్రొడక్షన్ విలువలను మనం ఊహించలేం. అజయ్ భూయాన్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో లోపాలు కూడా చాలానే కనిపిస్తాయి. అసలు ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ను దర్యాప్తు చేసే తీరే గందరగోళంగా అనిపిస్తుంది. కానీ చాలా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఉండే సస్పెన్స్ మాత్రం మొదటి నుంచీ చివరి వరకూ కొనసాగుతుంది. హత్య ఎవరు చేశారు అన్న ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది.

తనను వెంటాడుతున్న గతాన్ని దిగమింగుకుంటూనే దేవిక ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంటుంది. ఏడు ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ రన్ టైమ్ కూడా తక్కువే. ఒక్కో ఎపిసోడ్ గరిష్ఠంగా 25 నిమిషాలు ఉంటుంది. కొన్ని 16 నిమిషాల్లోనే ముగిసేవి కూడా ఉన్నాయి. దీంతో రెండు, రెండున్నర గంటల్లోనే ఈ వెబ్ సిరీస్ ముగుస్తుంది. ఈ వీకెండ్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ ఛల్ కపట్ ను మీ లిస్టులో చేర్చుకోవచ్చు. జీ5 ఓటీటీలో హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం