సైలెంట్‌గా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్.. ఇదో గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-thriller movie pune highway ott release date murder mystery movie now streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సైలెంట్‌గా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్.. ఇదో గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ

సైలెంట్‌గా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్.. ఇదో గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పుడో థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడెన్ గా ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ సొంతం చేసుకున్న మూవీ ఇది.

సైలెంట్‌గా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్.. ఇదో గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ

థ్రిల్లర్ మూవీ అభిమానుల కోసం ఈ వీకెండ్ మరో సినిమా సిద్ధంగా ఉంది. ఇదో హిందీ మూవీ. మే 23న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా పేరు పుణె హైవే. ఐఎండీబీలో 8.1 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు.

పుణె హైవే ఓటీటీ స్ట్రీమింగ్

ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీ పుణె హైవే శుక్రవారం (జులై 4) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మే 23న సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.

థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సడెన్ గా ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు.

పుణె హైవే మూవీ గురించి..

పుణె హైవే ఓ హిందీ థ్రిల్లర్ మూవీ. జిమ్ సర్బ్, అమిత్ సాధ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. భార్గవ కృష్ణ, రాహుల్ కన్హ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. గతేడాది నవంబర్లోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించగా.. మే 23న థియేటర్లలో రిలీజైంది. స్నేహం, హత్య చుట్టూ తిరిగే థ్రిల్లర్ సినిమా ఇది.

ముగ్గురు స్నేహితులు ముంబైలోని ఒకే భవనంలో పెరిగి పెద్దవుతారు. వాళ్ల మధ్య మంచి స్నేహం ఉంటుంది. అయితే వాళ్లకు 200 కి.మీ. దూరంలోని ఓ చెరువులో దొరికే ఓ మృతదేహం వాళ్ల జీవితాలను మార్చేస్తుంది. అసలు ఆ హత్యకు వీళ్లకు సంబంధం ఏంటి? వాళ్ల స్నేహం నిలుస్తుందా? ఆ హత్య మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే పుణె హైవే మూవీ చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం