OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న సూపర్ థ్రిల్లర్ మూవీ.. 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్.. ట్రైలర్ రిలీజ్-thriller movie costao ott release date zee5 ott to stream costao from 1st may trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న సూపర్ థ్రిల్లర్ మూవీ.. 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్.. ట్రైలర్ రిలీజ్

OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న సూపర్ థ్రిల్లర్ మూవీ.. 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్.. ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu

OTT Thriller Movie: ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (ఏప్రిల్ 17) రిలీజ్ చేశారు. గోవాలో జరిగే 1500 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరిగే స్టోరీతో ఈ మూవీ వస్తోంది.

ఓటీటీలోకి నేరుగా వస్తున్న సూపర్ థ్రిల్లర్ మూవీ.. 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్.. ట్రైలర్ రిలీజ్

OTT Thriller Movie: గోవా స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ లో ఇప్పుడు ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (ఏప్రిల్ 17) రిలీజ్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది.

కోస్టావో మూవీ ట్రైలర్

జీ5 ఓటీటీలోకి నేరుగా వస్తున్న ఆ థ్రిల్లర్ మూవీ పేరు కోస్టావో (Costao). ఇది 1990లనాటి గోవా స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా. ఇప్పుడంటే గోవా అనగానే అందమైన బీచ్‌లు, ఓ మంచి పర్యాటక ప్రదేశంగానే అందరికీ తెలుసు. కానీ మూడు దశాబ్దాల కిందట ఇది గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డా. ఆ పాయింట్ ఆధారంగానే ఈ కోస్టావో మూవీ వస్తోంది. ఈ సినిమా మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కొన్ని రోజుల కిందట ఈ సినిమాను అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ.. తాజాగా ట్రైలర్ లాంచ్ చేసింది. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమాలో కోస్టావో ఫెర్నాండెజ్ అనే కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. గోవా తీరానికి రానున్న 1500 కిలోల బంగారం స్మగ్లింగ్ ను ఆపేందుకు అతడు చేసే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్లో చూడొచ్చు.

కోస్టావో ట్రైలర్ ఎలా ఉందంటే?

సేజల్ షా డైరెక్ట్ చేసిన కోస్టావో మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. గోల్డ్ స్మగ్లింగ్ ఆట కట్టించడానికి ప్రయత్నించే కోస్టావో ఫెర్నాండెజ్ అనే కస్టమ్స్ ఆఫీసర్ కథే ఇది. మూవీ ట్రైలర్ మంచి థ్రిల్ పంచింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఏ వ్యవస్థ అయితే తనకు స్మగ్లింగ్ ను అడ్డుకునే అధికారాన్ని ఇచ్చిందో.. అదే వ్యవస్థ తనకు అడ్డుకట్ట వేస్తే ఆ అధికారి ఎలా పోరాడతాడన్నదే ఈ కోస్టావో మూవీలో చూడొచ్చు.

మన సమాజంలో ఓ అధికారి బలంగా, నిజాయతీగా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ.. ఇంట్లో మాత్రం అలా ఉండకూడదన్నది వాళ్ల ఫీలింగ్ అని మూవీలో తన పాత్ర గురించి నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నాడు. ఓ నిజాయతీ కలిగిన ఓ ఆఫీసర్ ఇటు వృత్తి, అటు కుటుంబం మధ్య ఎలా నలిగిపోతాడో ఈ కోస్టావో మూవీలో చూడొచ్చు.

కోస్టావో మూవీ గురించి..

కోస్టావో మూవీని సేజల్ షా డైరెక్ట్ చేశాడు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీతోపాటు ప్రియా బాపట్, హుస్సేన్ దలాల్, గగన్ దేవ్ రియర్, కిశోర్ కుమార్ లాంటి వాళ్లు నటించారు. ఈ థ్రిల్లర్ మూవీ మే 1వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటికే ఈ ఓటీటీలో నవాజుద్దీన్ సిద్దిఖీకి చెందిన రౌతు కా రాజ్, హడ్డి, రామన్ రాఘవ్ 2.0, బదలాపూర్, ఘూమ్‌కేతు, బాబుమోషాయ్ బందూక్‌బాజ్ అనే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ కోస్టావో కూడా స్ట్రీమింగ్ కు రాబోతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం