నవీన్ రాజ్ పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ తెర చాప. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి కీలక పాత్రల్లో నటించారు. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్ను హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ రిలీజ్ చేశారు.
వేయిగడపలు, అధికారపు అహం మంటల్లో కాలి స్మశానంగా మారుతుంది అనే ఇంటెన్స్ డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో రాజీవ్ కనకాల పొలిటికల్ లీడర్గా కనిపిస్తోన్నారు. సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చే విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ టీజర్కు హైలైట్గా నిలుస్తోన్నాయి.
ఈ వేడుకలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ... "తెరచాప కథ బాగుంది. నవీన్ ని చూస్తుంటే తమిళ హీరో విక్రమ్ గుర్తొస్తున్నాడు. ఓ సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడతాడో నవీన్ కూడా అంతే కష్టపడుతున్నాడు. కచ్చితంగా నవీన్ మన టాలీవుడ్ కి విక్రమ్ లాంటి హీరో అవుతాడు. నవీన్ శ్రమకు తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఈ మూవీతో దక్కుతుంది" అని అన్నారు.
డైరెక్టర్ జోయెల్ జార్జ్ మాట్లాడుతూ.. " మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఈ మూవీలో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి రిఫరెన్స్ లు కూడా సినిమాలో కనిపిస్తాయి" అని పేర్కొన్నారు.
తనపై నమ్మకంతో ఈ సినిమా మీద 3 నిర్మాత కోట్లు బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారని హీరో నవీన్ అన్నాడు. రివేంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నామని, కంప్లీట్ రా అండ్ రస్టిక్గా ఈ మూవీ సాగుతుందని చెప్పారు. తెరచాప చిత్ర టీజర్ చాలా బాగుంది. దర్శకుడి మేకింగ్ బీజీఎమ్ బాగున్నాయని హీరో కార్తీక్ రత్నం అన్నారు. నిర్మాతగా ఇదే తన తొలి మూవీ అని కైలాష్ పేర్కొన్నారు.
నాగ మహేష్, ఫిష్ వెంకట్, జబర్ధస్థ్ అప్పారావు, రైజింగ్ రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీకి ప్రజల్ క్రిష్, ఎంఎల్ రాజా మ్యూజిక్ అందించారు. త్వరలో తెరచాప మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం