పాత సీరియల్స్కు శుభం కార్డు వేస్తూ వరుసగా కొత్త సీరియల్స్ను అనౌన్స్ చేస్తోంది ఈటీవీ. తాజాగా ఈటీవీ ద్వారా మరో సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్ టైటిల్ను ఇటీవల ఈటీవీ అఫీషియల్గా ప్రకటించింది. ఈ సీరియల్కు ఆరో ప్రాణం అనే పేరును కన్ఫామ్ చేశారు.
ఆరో ప్రాణం టైటిల్ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సీరియల్ ప్రారంభమవుతుందని ఈటీవీ వెల్లడించింది. టెలికాస్ట్ డేట్, యాక్టర్స్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు.
ఆరో ప్రాణం సీరియల్లో టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ రాజ్కుమార్, యుమన కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగార్జున, వినూత గౌడ్ లీడ్ రోల్స్ చేయబోతున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ లవ్ డ్రామాగా ఈ సీరియల్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. జూన్ నెలలో ఆరో ప్రాణం సీరియల్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. మధ్యాహ్నం స్లాట్లో ఆరో ప్రాణం సీరియల్ ప్రసారమవుతోందని అంటున్నారు.
ప్రస్తుతం ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న మౌన పోరాటం సీరియల్ ముగింపుకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఆ సీరియల్ స్థానంలో ఆరో ప్రాణం మొదలవుతుందని అంటున్నారు. మౌన పోరాటం సీరియల్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు టెలికాస్ట్ అవుతోంది. అదే టైమ్ను ఆరో ప్రాణం సీరియల్కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
కన్నడ యాక్టర్ అయిన నాగార్జున.... కస్తూరి సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కోడళ్లు మీకు జోహార్లు, మధురానగరిలో సీరియల్స్లో లీడ్ యాక్టర్గా కనిపించాడు. కన్నడంలో ఎక్క రాజా రాణితో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
రాజ్కుమార్, యుమన పలు తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా, క్యారెక్టర్ యాక్టర్స్గా కనిపించారు. అమ్మ రాజీనామా మూవీతో యాక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు రాజ్కుమార్. ఆ తర్వాత సంసారాల మెకానిక్, కాలేజీ బుల్లోడు, బారిష్టర్ శంకర్ నారాయణతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. స్టార్ హీరోల సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు.
1990 దశకంలో టాలీవుడ్లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది యమున. మౌన పోరాటం, ఎర్ర మందారం, పుట్టింటి పట్టు చీర, మామగారు, బ్రహ్మచారి మొగుడు లాంటి కుటుంబ కథా చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. సిల్వర్ స్క్రీన్పైనే కాకుండా టీవీల్లోనూ సత్తా చాటింది. యమున నటించిన అన్వేషిత, విధితో పాటు మరికొన్ని సీరియల్స్ సూపర్ హిట్టయ్యాయి.
సంబంధిత కథనం