ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా.. కలహాలే లేని ఓ హైస్కూల్ ప్రేమ కథ.. ఇక్కడ చూసేయండి-telugu romantic drama kaalamega karigindhi ott release date sun nxt to stream the movie from 9th may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా.. కలహాలే లేని ఓ హైస్కూల్ ప్రేమ కథ.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా.. కలహాలే లేని ఓ హైస్కూల్ ప్రేమ కథ.. ఇక్కడ చూసేయండి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా రాబోతోంది. అసలు కలహాలే లేని ఓ హై స్కూల్ ప్రేమ కథ ఇది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఆ మూవీ విశేషాలేంటో తెలుసుకోండి.

ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా.. కలహాలే లేని ఓ హైస్కూల్ ప్రేమ కథ.. ఇక్కడ చూసేయండి

థియేటర్లలో పెద్దగా బజ్ లేకుండానే రిలీజైన ఓ తెలుగు రొమాంటిక్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా పేరు కాలమేగా కరిగింది. మార్చి 21న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సదరు ఓటీటీ సోమవారం (మే 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

కాలమేగా కరిగింది ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగులో వచ్చిన ఓ రొమాంటిక్ డ్రామా మూవీ కాలమేగా కరిగింది. మార్చి 21న థియేటర్లలో రిలీజైంది. అసలు స్టార్లు ఎవరూ లేని ఓ చిన్న సినిమా. ఇప్పుడీ మూవీ మే 9 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

“కాలాలు మారాయి. ఏళ్లు గడిచాయి. కానీ అతని మనసు? ఇప్పటికీ ఆమెదే. కాలమేగా కరిగింది మే 9న మీ సన్ నెక్ట్స్‌లో” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ విషయం తెలిపింది. ఈ సందర్భంగా సినిమా పోస్టర్ ను కూడా యాడ్ చేసింది.

కాలమేగా కరిగింది మూవీ గురించి..

కాలమేగా కరిగింది మూవీ మార్చి 21న థియేటర్లలో రిలీజైంది. ఇదొక రొమాంటిక్ డ్రామా. కలహాలే లేని ఓ ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. శింగర మోహన్ డైరెక్ట్ చేశాడు. కథ కూడా అతడే అందించాడర. ఈ సినిమాలో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇదొక హైస్కూల్ ప్రేమ కథ. ఫణి, బిందు అనే ఇద్దరు క్లాస్ మేట్స్ ప్రేమించుకుంటారు.

స్కూల్ వదిలి వెళ్లిన తర్వాత జీవితంలో సెటిలైనా కూడా ఆ తొలి ప్రేమ అతని మనసులో అలాగే ఉండిపోతుంది. ఆ స్కూలును, ప్రేమను, తన మధురమైన గతాన్ని వెతుక్కుంటూ అతడు వెళ్తాడు. ఈ కాలమేగా కరిగింది మూవీని ఎంతో కవితాత్మకంగా తెరకెక్కించారు. ఈ మూవీని థియేటర్లలో చూడకపోతే మే 9 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అందులో చూసేయండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం