ఆహా వీడియో ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ రాబోతోంది. కామెడీకి తోడు మైథాలజీ, థ్రిల్లర్ జోడించి జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇందులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటించాడు. తాజాగా వచ్చిన ఫన్నీ టీజర్ ఆసక్తిగా సాగింది.
రాజ్ తరుణ్ లీడ్ రోల్లో వస్తున్న ఈ సినిమా పేరు చిరంజీవ. నిజానికి ఓ వెబ్ సిరీస్ గా వస్తుందనుకున్న దీనిని మూవీగా ఇప్పుడు ఆహా వీడియో పరిచయం చేసింది. అదిరే అభి (అభినయ కృష్ణ) డైరెక్ట్ చేశాడు. గురువారం (అక్టోబర్ 2) రిలీజైన టీజర్ ఫన్నీగా సాగిపోయింది. ఇందులో రాజ్ తరుణ్ ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.
అతనికి అవతలి మనషులను చూడగానే ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోతారో చెప్పే శక్తి వస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ గా పని చేసే అతని జీవితం దీనివల్ల ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నది అన్నదే ఈ మూవీ స్టోరీ. గతేడాది డిసెంబర్ లోనే ఈ మూవీ పోస్టర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. నవంబర్ 7వ తేదీన ఆహా వీడియో ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఏడాది జనవరిలోనే ఈ చిరంజీవ స్ట్రీమింగ్ అవుతుందని భావించినా.. వివిధ కారణాల వల్ల చాలా ఆలస్యమైంది. చివరికి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చే నెలలో రాబోతోంది. చిరంజీవ మూవీని అభినయ కృష్ణ డైరెక్ట్ చేశాడు. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ మూవీ టీజర్ లో రాజ్ తరుణ్ ఈ సినిమాలో శివ అనే పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. తనకు పుట్టినప్పటి నుంచీ స్పీడెక్కువ అని అతడు చెబుతాడు. ఆ స్పీడుకు తగినట్లు అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం సరిగ్గా సరిపోతుందని అందులో చేరతాడు.
ఎవరికీ దక్కని అదృష్టం నీకు దక్కిందని టీజర్లో ఓ పూజారి అతనితో చెప్పడం కూడా చూడొచ్చు. అది అందరిని చూడగానే వాళ్ల ఆయుష్షు ఎంతో చెప్పే శక్తి. అంతకుమించి ఈ టీజర్లో పెద్దగా మూవీ స్టోరీని రివీల్ చేయలేదు. మరి నవంబర్ 7న నేరుగా ఆహా వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
సంబంధిత కథనం