Telugu Indian Idol 2: ఇండియన్ ఐడల్ 2 ఫినాలే తగ్గేదేలే.. ఐకాన్ స్టార్ వచ్చేస్తున్నాడు
Telugu Indian Idol 2: ఇండియన్ ఐడల్ 2 ఫినాలేకు తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ వచ్చేస్తున్నాడు. తొలి సీజన్ లో ఫినాలేకు మెగాస్టార్ ఛీఫ్ గెస్ట్ గా రాగా.. ఈసారి అల్లు అర్జున్ రానుండటం విశేషం.
Telugu Indian Idol 2: తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేకి అంతా సిద్ధమైంది. ఈసారి ఈ స్పెషల్ అకేషన్ కు ఛీఫ్ గెస్ట్ గా స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం (మే 23) ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ సీజన్ సూపర్ సక్సెస్ సాధించగా.. ఇప్పుడు ఫినాలేకు అల్లు అర్జున్ వస్తుండటంతో అంతకంటే గ్రాండ్ ముగింపు లభించనుంది.
ఫినాలే ప్రోమోలో అల్లు అర్జున్ ఎప్పటిలాగే చాలా స్టైలిష్ గా కనిపించాడు. పుష్ప 2లో అతడి గెటప్ లో వేసుకున్న కొందరు అల్లు అర్జున్ కు వెల్కమ్ చెప్పారు. ఇలాంటి షోకు రావడం నిజంగా సంతోషంగా ఉందని అతడు అన్నాడు. "తెలుగు ఇండియన్ ఐడల్ 2 అద్భుతమైన టాలెంట్, మ్యూజిక్ పవర్ ను సెలబ్రేట్ చేసుకునే వేదిక. ఈ గ్రాండ్ ఫినాలేలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని అర్జున్ అనడం ఈ ప్రోమోలో చూడొచ్చు.
అంతేకాదు ఈ ఫినాలేలో తన ఫస్ట్ క్రష్ గురించి కూడా అల్లు అర్జున్ చెప్పడం విశేషం. ఆమె పేరు శృతి అని అతడు చెప్పాడు. ఇప్పుడు ఈ ఫినాలేలోని ఐదుగురు పార్టిసిపెంట్లలో ఆ పేరు కలిగిన వ్యక్తి కూడా ఒకరు ఉండటం విశేషం. ఇదే ఫినాలేలో సింగర్ సౌజన్య కూతురికి కూడా అల్లు అర్జున్ ముద్దు పెట్టడం చూడొచ్చు.
ఇక స్టేజ్ పై అతడు అదిరిపోయే స్టెప్పులు కూడా వేశాడు. ఈ తెలుగు ఇండియన్ ఐడల్ 2 షోలో పాల్గొనడానికి మొత్తం 10 వేల మంది పార్టిసిపెంట్స్ పోటీ పడగా.. చివరికి ఐదుగురు మిగిలారు. వీళ్లలో న్యూజెర్సీకి చెందిన శృతి, హైదరాబాద్ కు చెందిన జయరాం, సిద్దిపేట్ కు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్ కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతులు ఫినాలేలో పోటీ పడుతున్నారు.
సంబంధిత కథనం