Keechurallu OTT: తెలుగులోకి డ‌బ్ అవుతోన్న‌మ‌ల‌యాళం సైబ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌-telugu cyber thriller movie keechurallu streaming on etv win ott from may 30th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keechurallu Ott: తెలుగులోకి డ‌బ్ అవుతోన్న‌మ‌ల‌యాళం సైబ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌

Keechurallu OTT: తెలుగులోకి డ‌బ్ అవుతోన్న‌మ‌ల‌యాళం సైబ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌

Keechurallu OTT: రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ కీడం తెలుగులో కీచురాళ్ళు పేరుతో డ‌బ్ అవుతోంది. ఈ సైబ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో మే 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

కీచురాళ్ళు ఓటీటీ

Keechurallu OTT: ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం సైబ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ కీడం థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2022లో రిలీజైన ఈ మ‌ల‌యాళం మూవీ వినూత్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో అభిమానుల‌ను మెప్పించింది. కీడం మూవీ కీచురాళ్ళు పేరుతో తెలుగులోకి డ‌బ్ అవుతోంది.

డైరెక్ట్‌గా ఓటీటీలోకి...

కీడం తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీ మే 30న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కీచురాళ్ళు మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్ చేసిన ఈటీవీ విన్ ఓటీటీ ర‌జిషా విజ‌య‌న్‌ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సీరియ‌స్ లుక్‌లో ర‌జిషా విజ‌య‌న్‌ క‌నిపిస్తోంది.ఆమె చుట్టూ వ‌ల‌యాకారంలో కంప్యూట‌ర్స్ స్క్రీన్స్, స్పై కెమెరాలు క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

కీచురాళ్ళు మూవీకి రాహుల్ రిజీ నాయ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌జిషా విజ‌య‌న్‌తో పాటు శ్రీనివాస‌న్‌, విజ‌య్ బాబు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. కీచురాళ్ళు మూవీలో సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌గా రాజీషా విజ‌య‌న్‌ క‌నిపించింది.

కీచురాళ్లు క‌థ ఇదే...

రాధికా బాల‌న్ (ర‌జిషా విజ‌య‌న్‌) ఓ సైబ‌ర్ సెక్యూరిటీ స్టార్ట‌ప్ కంపెనీని ర‌న్ చేస్తుంటుంది. సైబ‌ర్ క్రైమ్‌ను సాల్వ్ చేయ‌డంలో బాధితుల‌తో పాటు పోలీసుల‌కు సాయ‌ప‌డుతుంది. అనుకోకుండానే సైబ‌ర్ క్రైమ్ బాధితురాలిగా రాధిక మారిపోతుంది. ఓ వ్య‌క్తి ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తుంటాడు? అత‌డు ఎవ‌రు? అదృశ్య వ్య‌క్తిని త‌న తెలివితేట‌ల‌తో రాధిక ఎలా ప‌ట్టుకుంది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. సైబ‌ర్ మోసాల కార‌ణంగా మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను ద‌ర్శ‌కుడు సందేశాత్మ‌కంగా ఈ మూవీలో చూపించ‌న తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌...

కీడం మూవీ కంటే ముందు ర‌జిషా విజ‌య‌న్‌, ద‌ర్శ‌కుడు రాహుల్ కాంబినేష‌న్‌లో ఖో - ఖో అనే స్పోర్డ్స్ డ్రామా మూవీ తెర‌కెక్కింది. ఖోఖో మూవీ మ‌ల‌యాళ‌ సినీ ఇండ‌స్ట్రీలోనే అత్య‌ధిక టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్న మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

జై భీమ్‌సినిమాలో...

గ్లామ‌ర్‌కు దూరంగా న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌తిభ‌ను చాటుకుంటోంది ర‌జిషా విజ‌య‌న్‌. త‌మిళంలో సూర్య జైభీమ్ పాత్ర‌లో అస‌మాన యాక్టింగ్‌తో మెప్పించింది. మ‌ల‌యాళంలో హీరోయిన్‌గా ఇర‌వైకిపైగా సినిమాలు చేసింది. ల‌వ్‌, మ‌ల‌యాన్ కుంజు, మ‌ధురమ‌నోహ‌ర మోహ‌న్ తో పాటు ప‌లు సినిమాల‌కు ర‌జిషా విజ‌య‌న్‌కు మంచి పేరుతెచ్చిపెట్టాయి.

రామారావు ఆన్ డ్యూటీలో...

తెలుగులో ర‌వితేజ హీరోయిన్‌గా న‌టించిన రామారావు ఆన్ డ్యూటీలో ఓ హీరోయిన్‌గా ర‌జిషా విజ‌య‌న్ క‌నిపించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో తెలుగు ఎంట్రీ ఆమెకు అంత‌గా క‌లిసిరాలేదు.