మరో ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ కామెడీ ఫిల్మ్‌..దెయ్యంతో పెళ్లి.. ఏడాది తర్వాత స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-telugu block buster horror comedy thriller om bheem bush to stream on another ott after a year of release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మరో ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ కామెడీ ఫిల్మ్‌..దెయ్యంతో పెళ్లి.. ఏడాది తర్వాత స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

మరో ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ కామెడీ ఫిల్మ్‌..దెయ్యంతో పెళ్లి.. ఏడాది తర్వాత స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓ తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్ హారర్ కామెడీ థ్రిల్లర్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే రచ్చ, దెయ్యంతో పెళ్లి లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ (x/SimplySouthApp)

మరో ఓటీటీలోకి ఓ తెలుగు మూవీ వచ్చేస్తోంది. రిలీజైన ఏడాది తర్వాత ఇంకో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. 2024లో వచ్చిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ఓం భీమ్ బుష్’ ఏ రేంజ్ లో ప్రేక్షకులను నవ్వించిందో తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నవ్వులతో కలెక్షన్లు అదరగొట్టింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి రాబోతోంది.

నవ్వుల సునామీ

శ్రీ విష్ణు, ప్రియదర్శి రాహుల్ రామ‌కృష్ణ‌ లీడ్ రోల్స్ ప్లే చేసిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ 2024 మార్చి 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరి, తింగరి పనులు ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే మూవీలో ఓ మహల్, దెయ్యంతో పెళ్లి లాంటి విషయాలు నవ్వుతూనే థ్రిల్ ను పంచాయి.

ఆ ఓటీటీలో

థియేటర్లలో బంపర్ హిట్ గా నిలిచిన ‘ఓం భీమ్ బుష్’ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఆ ఓటీటీలో 2024, ఏప్రిల్ 12 నుంచే ఈ మూవీ అందుబాటులో ఉంది. థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలోనూ ఫ్యాన్స్ ను అలరించింది. ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి రాబోతోంది.

సౌత్ సినిమాల ఓటీటీగా పేరు తెచ్చుకున్న సింప్లీ సౌత్ ఫ్లాట్ ఫామ్ లో ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. మే 2 నుంచి ఈ ఓటీటీలోకి ఓం భీమ్ బుష్ రాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

కథ ఏమిటంటే?

లాజిక్ లను పక్కనపెట్టి కేవలం కామెడీతోనే ఓం భీమ్ బుష్ మూవీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. లెగసీ యూనివర్సిటీలో పీహెచ్ డీ స్టూడెంట్స్ గా క్రిష్ (శ్రీ విష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మ్యాడీ రేలంగి (రాహుల్ రామ‌కృష్ణ‌) ప్రయోగాలు చేస్తుంటారు. వీళ్ల టార్చర్ భరించలేక డాక్టరేట్లు ఇచ్చి బయటకు పంపించేస్తారు. ఆ తర్వాత భైరవపురం చేరుకుని బ్యాంగ్ బ్రదర్స్ పేరుతో ఏ టూ జెడ్ సర్వీస్ స్టార్ట్ చేస్తారు.

అప్పుడే గ్రామంలో ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో సంపంగి మహల్ లో ఉన్న నిధిని తీసుకురావాలని ఈ ముగ్గురికి ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆ మహల్ లో ఉన్న దెయ్యానికి ఓ లవ్ స్టోరీ ఉంటుంది. చివరకు స్టోరీ ఏంటీ? దెయ్యాన్ని హీరో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నిధి దక్కిందా? లేదా అన్నది మిగతా స్టోరీ.

ఈ మూవీని డైరెక్ట్ చేసిన శ్రీ హర్ష కొనుగంటినే కథ కూడా రాసుకున్నాడు. వి సెల్యూలాయిడ్ బ్యానర్ కింద ఈ మూవీని సునీల్ బలుసు ప్రోడ్యూస్ చేశాడు. ఈ మూవీకి సన్నీ మ్యూజిక్ అందించాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం