OTT Comedy Thriller: ఓటీటీలోకి మరో కామెడీ థ్రిల్లర్.. షూలో విలువైన వజ్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-tamil comedy thriller web series seruppugal jaakirathai will be streaming zee5 ott platform from march 28 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Thriller: ఓటీటీలోకి మరో కామెడీ థ్రిల్లర్.. షూలో విలువైన వజ్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Comedy Thriller: ఓటీటీలోకి మరో కామెడీ థ్రిల్లర్.. షూలో విలువైన వజ్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Comedy Thriller Web Series: సెరుప్పుగల్ జాకిరతై వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ కామెడీ థ్రిల్లర్ సిరీస్ డేట్‍పై అధికారిక సమాచారం వెల్లడైంది. ఈ సిరీస్‍ను ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Comedy Thriller: ఓటీటీలోకి మరో కామెడీ థ్రిల్లర్.. షూలో విలువైన వజ్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటీటీల్లో ఇటీవలికాలంలో కామెడీ వెబ్ సిరీస్‍ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ జానర్ సిరీస్‍లు వరుసగా వస్తున్నాయి. తాజాగా ‘సెరుప్పుగల్ జాకిరతై’ అనే కామెడీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. సింగపులి ఈ సిరీస్‍లో లీడ్ పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

స్ట్రీమింగ్ డేట్

సెరుప్పుగల్ జాకిరతై వెబ్ సిరీస్ మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ కామెడీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్‍కు రాజేశ్ సుసైరాజ్ దర్శకత్వం వహించారు.

సెరుప్పుగల్ జాకిరతై వెబ్ సిరీస్‍లో సింగంపులితో పాటు వివేక్ రాజగోపాల్, ఐరా అగర్వాల్, మనోహర్, ఇంద్రజిత్, మాప్ల గణేశ్, ఉసైన్, సబిత, పళని, ఉతుమలై రవి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎల్‍వీ ముత్తుగణేశ్ సంగీతం అందించారు. ఎజిచూర్ అరవిందన్ ఈ ఈ సిరీస్‍కు కథ అందించగా.. డైరెక్టర్ రాజేశ్ తెరకెక్కించారు.

సెరుప్పుగల్ జాకిరతై స్టోరీలైన్

వజ్రాలు స్మగ్లింగ్ చేస్ రత్నం తన ఇంటిపై అధికారులు రైడ్ చేస్తారని భయపడతాడు. ఓ విలువైన వజ్రాన్ని ఓ షూలో దాచి పెడతాడు. పొరపాటును ఆ షూను త్యాగరాజన్ అనే ఆడిటర్ వేసుకొని వెళతాడు. త్యాగరాజన్, అతడి కుమారుడు ఇలాంగో ఆ షూను పోగడతారు. ఆ షూను దొరికించుకునేందుకు రత్నం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని ట్విస్టులు, మలుపులు ఎదురవుతాయి. ఇంతకీ ఆ షూ ఏమైంది.. రత్రం దాన్ని కనిపెట్టగలిగాడా అనేది సెరుప్పుగల్ జాకిరతై సిరీస్‍లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. కామెడీతో ఫన్‍గా, థ్రిల్లింగ్‍గా ఆ సిరీస్ సాగుతుంది.

అదరగొడుతున్న కుటుంబస్థాన్

తమిళ కామెడీ డ్రామా చిత్రం కుటుంబస్థాన్.. ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అదరగొడుతోంది. మార్చి 7వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంలో మణికందన్ ప్రధాన పాత్ర పోషించారు. జనవరి 24న థియేటర్లలో రిలీజైన కుటుంబస్థాన్ మంచి హిట్ అయింది. రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించిన ఈ మూవీ కమర్షియల్‍గా సక్సెస్ కాగా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం