పెరుసు సినిమా ఓటీటీలోకి వచ్చాక చాలా పాపులర్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ తమిళ కామెడీ డ్రామా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో వైభవ్, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రెండింగ్లో దూసుకొచ్చింది. థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు రాబట్టని ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం సత్తాచాటుతోంది.
పెరుసు చిత్రం ప్రస్తుతం (ఏప్రిల్ 20) నెట్ఫ్లిక్స్ ఓటీటీ సినిమాల ట్రెండింగ్లో మూడో స్థానానికి దూసుకొచ్చింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్లో టాప్-3లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కొన్న భారీ సినిమాలను దాటేసి అదరగొడుతోంది.
పెరుసు సినిమా ఏప్రిల్ 11వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ స్టోరీలైన్తో వచ్చిన ఈ మూవీకి స్ట్రీమింగ్ తర్వాత సూపర్ రెస్పాన్స్ దక్కింది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై చాలా బజ్ నడుస్తోంది. దీంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీకి వ్యూస్ క్రమంగా పెరిగాయి. దీంతో ట్రెండింగ్లో టాప్-3లోకి వచ్చేసింది.
పెరుసు సినిమా మార్చి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ దాదాపు రూ.4కోట్ల బడ్జెట్తో రూపొందింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రాగా.. సుమారు రూ.3.5కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ లోబడ్జెట్ చిత్రం నెట్ఫ్లిక్స్ లాంటి భారీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. భారీ వ్యూస్ సాధిస్తోంది.
పెరుసు సినిమా స్టోరీలైన్.. చాలా మందిని ఆశ్చర్యపరిచింది. స్ట్రీమింగ్ తర్వాత చాలా మంది దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇంటి పెద్ద పరందామయ్య హఠాత్తుగా మరణిస్తాడు. అయితే, చనిపోయే ముందు వేసుకున్న వయాగ్రా ట్యాబ్లెట్ల వల్ల అంగం స్థంభించి ఉంటుంది. చనిపోయాక కూడా అలాగే ఉంటుంది. ఇది ఎవరైనా చూస్తే పరువు పోతుందని కుటుంబ సభ్యులు కంగారు పడతారు. ఎవరూ గమనించకుండా ఆయన ఇద్దరు కొడుకులు, కుటుంబ సభ్యులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దీని చుట్టే పెరుసు మూవీ సాగుతుంది.
పెరుసు మూవీకి ఇలాంగో రామ్ దర్శకత్వం వహించారు. శ్రీలంకన్ చిత్రం టెంటిగోకు తమిళ రీమేక్గా తెరకెక్కించారు. పెరుసులో వైభవ్, సునీల్తో పాటు నిహారిక, బాలశరవణన్, మునుష్కాంత్, చాందిని తమిళరాసన్, రెడిన్ కింగ్స్లే, వీటీవీ గణేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కార్తికేయన్ సంతానం, హర్మన్ బవేజా, హిరణ్య పెరీరా ప్రొడ్యూజ్ చేశారు. అరుణ్ రాజ్ సంగీతం అందించగా.. సత్య తిలకం సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం