ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీకి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా సూర్యాపేట్ జంక్షన్ సక్సెస్ మీట్ను ఇటీవల హైదరాబాద్లో మేకర్స్ నిర్వహించారు.
ఈ వేడుకలో హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, “‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమాకు పూర్తిగా పాజిటివ్ టాక్ ఉంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతుండటం ఆనందంగా ఉంది. మౌత్ టాక్ కూడా ప్రేక్షకులను థియేటర్ కు వెళ్లేలా చేస్తుంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయమిది. ఈ సక్సెస్ను సెలెబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
సూర్యాపేట్ జంక్షన్లో తన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తోందని, హీరోయిన్గా ఈ మూవీ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని నైనా సర్వర్ అన్నది. “ప్రభుత్వ ఉచిత పథకాలపై సినిమా ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం ఆడియెన్స్రీచ్ అవుతుంది. మంచి ప్రయత్నంగా ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలను అందుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది ”అని దర్శకుడు రాజేష్ నాదెండ్ల అన్నాడు.
సూర్యాపేట జంక్షన్ సినిమాను అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు నిర్మించారు. ఈ మూవీలో గబ్బర్సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్గా నటించాడు.
అర్జున్ (ఈశ్వర్) ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ జ్యోతి (నైనా సర్వర్) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. . నరసింహా (అభిమన్యు సింగ్) ఓ పొలిటికల్ లీడర్. ఎమ్మెల్యే కావాలని కలలు కంటుంటాడు, పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్రను పన్నుతాడు.
ఎన్నికల టైమ్లో అర్జున్ స్నేహితుడైన శీను హత్యకు గురవుతాడు. శీనును ఎవరు చంపారు? ఈ మర్డర్ వెనకున్న మిస్టరీని అర్జున్ ఎలా ఛేదించాడు? శీను హత్యకు నరసింహాకు ఉన్న సంబంధమేమిటి? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత కథనం