సీరియల్స్లో ఓ యాక్టర్ స్థానంలో మరో యాక్టర్ ఎంట్రీ ఇవ్వడం కామన్. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమో, ఇతర కారణాల వల్ల ఓ నటి లేదా నటుడో సీరియల్ నుంచి తప్పుకుంటే...అదే పాత్రలోకి మరో యాక్టర్ ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్ను సర్ప్రైజ్ చేస్తుంటారు. కానీ లీడ్ యాక్టర్స్ మారడం మాత్రం అరుదు.
స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గీత ఎల్ఎల్బీ సీరియల్లో మాత్రం ఏకంగా హీరోనే మారిపోయాడు.గత డిసెంబర్లో స్టార్ మా ఛానెల్లో గీత ఎల్ఎల్బీ సీరియల్ మొదలైంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్లో కన్నడ నటుడు భవీష్ లీడ్ రోల్లొ నటించాడు.
తాజాగా శుక్రవారం నాటి ఎపిసోడ్లో భవీష్ స్థానంలో కన్నడ నటుడు గౌరవ్ గుప్తా ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్కు షాకిచ్చాడు. హీరో మార్పుకు కారణం ఏమిటన్నది మాత్రం స్టార్ మా రివీల్ చేయలేదు. కన్నడ కమిట్మెంట్స్ కారణంగానే భవీష్ గీత ఎల్ఎల్బీ సీరియల్కు దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. సీరియల్ మొదలై నాలుగు నెలలు కూడా కాకముందే హీరో మారిపోవడం ఆసక్తికరంగా మారింది.
హిందీ, తమిళంలో సీరియల్స్తో కెరీర్ ప్రారంభించిన గౌరవ్ గుప్తా లాహిరి లాహిరి లాహిరిలో సీరియల్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న మల్లి సీరియల్లో అరవింద్గా కనిపించాడు. మల్లి తర్వాత అతడు గీత ఎల్ఎల్బీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
గీత ఎల్ఎల్బీ సీరియల్లో నీతూ మాయ టైటిల్ పాత్రలో నటిస్తోంది. మలయాళ నటి అయిన నీతూ మాయ ఈ సీరియల్ ద్వారానే తెలుగులోకి అడుగుపెట్టింది. ఇమ్రాన్ఖాన్, శ్వేత విజయ్కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
ఆరంభంలో గీత ఎల్ఎల్బీ సీరియల్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు టెలికాస్ట్ చేసింది స్టార్ మా. ప్రారంభమైన పది రోజులకే టైమ్ను మార్చారు. ప్రస్తుతం రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అవుతోంది. బెంగాళీ సీరియల్ గీతా ఎల్ఎల్బీకి రీమేక్గా అదే టైటిల్తో తెలుగులో ఈ సీరియల్ను రీమేక్ చేశారు.
లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్లో గీతా ఎల్ఎల్బీ సీరియల్ అర్బన్, రూరల్ ఏరియాలో కలిపి 3.34 టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకున్నది. అర్బన్ ఏరియాలో మాత్రం 3.46 రేటింగ్ వచ్చింది.