టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. తాజాగా సింగిల్ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 9 థియేటర్లలో శ్రీ విష్ణు సింగిల్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కామెడీ రొమాంటిక్ సినిమాగా పేరు తెచ్చుకున్న సింగిల్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
అలాగే, సింగిల్ మూవీకి ఫుల్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా అంతా ఆద్యం కామెడీతో అలరించిందని టాక్ వినిపిస్తోంది. దీంతో సింగిల్ మూవీకి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగుంటున్నాయి. ఇండియాలో సింగిల్ మూవీకి మొదటి రోజున రూ. 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది.
అలాగే, సింగిల్ మూవీ నిన్న రిలీజై బ్లాక్బస్టర్ రన్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సింగిల్ సినిమాకు మొదటి రోజున రూ. 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సింగిల్ మూవీ నవ్వుల అల్లరి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అంటూ మేకర్స్ చెప్పుకోవచ్చారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున సింగిల్ చిత్రానికి రూ. 1.5 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆఫ్లైన్ టికెట్స్తో ఈ వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.2 నుంచి 2.4 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ రానున్నాయట. ఓవర్సీస్లో 80 వేల డాలర్స్ మార్క్ను సింగిల్ అందుకుందని సమాచారం.
అలాగే, బుక్ మై షో యాప్లో 24 గంటల వ్యవధిలోనే సింగిల్ సినిమాకు 50.71 వేల టికెట్స్ అమ్ముడిపోయినట్లు మేకర్స్ తెలిపారు. రెండోరోజుతోపాటు వీకెండ్లో సింగిల్ మూవీకి కలెక్షన్స్ మరింతగా వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే, సింగిల్ మూవీలో శ్రీ విష్ణుకు జోడీగా హీరోయిన్స్ కేతిక శర్మ, ఇవానా నటంచారు. కమెడియ్ వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించాడు. అల్లు అరవింద్ సమర్పణలో సింగిల్ మూవీ తెరకెక్కింది. ఇక మూవీలో శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్, కెమిస్ట్రీ అదిరిపోయిందని చెబుతున్నారు. మంచి పాజిటివ్ రివ్యూలతో సింగిల్ కలెక్షన్లలో జోరు చూపిస్తోంది.
సంబంధిత కథనం