Neha Kakkar: వాళ్లు నా డబ్బు తీసుకొని పారిపోయారు.. కనీసం నీళ్లు ఇవ్వలేదు.. ఆ కాన్సర్ట్ ఫ్రీగా చేశాను: సింగర్ వివరణ-singer neha kakkar says melbourne concert organizers took her money and ran away ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Neha Kakkar: వాళ్లు నా డబ్బు తీసుకొని పారిపోయారు.. కనీసం నీళ్లు ఇవ్వలేదు.. ఆ కాన్సర్ట్ ఫ్రీగా చేశాను: సింగర్ వివరణ

Neha Kakkar: వాళ్లు నా డబ్బు తీసుకొని పారిపోయారు.. కనీసం నీళ్లు ఇవ్వలేదు.. ఆ కాన్సర్ట్ ఫ్రీగా చేశాను: సింగర్ వివరణ

Hari Prasad S HT Telugu

Neha Kakkar: బాలీవుడ్ సింగర్ నేహా కక్కడ్ మెల్‌బోర్న్ కాన్సర్ట్ మూడు గంటల ఆలస్యంపై వస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చింది. నిర్వాహకులు తన డబ్బంతా తీసుకొని పారిపోయారని, తమకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆమె వాపోయింది.

వాళ్లు నా డబ్బు తీసుకొని పారిపోయారు.. కనీసం నీళ్లు ఇవ్వలేదు.. ఆ కాన్సర్ట్ ఫ్రీగా చేశాను: సింగర్ వివరణ (Instagram)

Neha Kakkar: బాలీవుడ్ సింగర్ నేహా కక్కడ్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఈ మధ్య ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ కాన్సర్ట్ కు మూడు గంటలు ఆలస్యం రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఇప్పుడామె తన ఆలస్యానికి కారణమేంటో వివరించింది. నిర్వాహకులు తనను నిలువునా ముంచినట్లు ఆమె చెప్పింది.

అసలు ఏం జరిగిందంటే?

నేహా కక్కడ్ గురువారం (మార్చి 27) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది. అందులో మెల్‌బోర్న్ కాన్సర్ట్ ఎందుకు అంత ఆలస్యమైంది? అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

“ఆమె 3 గంటలు ఆలస్యంగా వచ్చిందని వాళ్లు చెప్పారు. కానీ అసలు ఆమెకు ఏం జరిగిందో ఒక్కసారైనా అడిగారా? ఆమెకు, ఆమె బ్యాండ్ కు వాళ్లు ఏం చేశారో చెప్పారా? నేను స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మాకు ఏం జరిగిందో నేను చెప్పలేదు. ఎందుకంటే ఎవరినైనా శిక్షించడానికి నేనెవరిని? కానీ ఇప్పుడు నింద నాపై వేశారా కాబట్టి చెబుతున్నాను” అని నేహ చెప్పింది.

నా డబ్బుతో పారిపోయారు: నేహ

“నేను మెల్‌బోర్న్ కాన్సర్ట్ ఫ్రీగా చేశాను. ఆర్గనైజర్లు నా డబ్బుతో పారిపోయారు. నా బ్యాండ్ కు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని ఫ్రెండ్స్ వాళ్లకు భోజనం పెట్టించారు. ఇంత జరిగినా మేము స్టేజ్ మీదికి వచ్చాము. రెస్ట్ లేకుండా పర్ఫామ్ చేశాము. కేవలం నా ఫ్యాన్స్ గంటల తరబడి వేచి చూస్తున్నారన్న కారణంతోనే” అని నేహ రాసుకొచ్చింది.

“కనీసం సౌండ్ చెక్ చేసుకునే అవకాశం కూడా కలగలేదు. ఆర్గనైజర్లు మా మేనేజర్ కాల్స్ కూడా తీసుకోలేదు. స్పాన్సర్లు, అందరి నుంచి వాళ్లు దూరంగా పారిపోయారు. ఇంకా చెప్పాల్సింది చాలానే ఉన్నా.. ఇక చాలు” అని నేహ చెప్పింది. ఈ కాన్సర్ట్ లో స్టేజ్ పైనే ఏడుస్తూ ఆమె అభిమానులకు క్షమాపణ చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ వేచి చూసిన సమయాన్ని కూడా తాను కవర్ చేస్తానని చెప్పింది. అయితే తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అసలు మెల్‌బోర్న్ లో ఏం జరిగిందో నేహ వివరణ ఇచ్చింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం