Ntr Movies Re Release: ఎన్టీఆర్ బర్త్డేకు త్రిబుల్ బొనాంజా - మూడు సినిమాలు రీ రిలీజ్
Ntr Movies Re Release: ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులకు త్రిబుల్ బొనాంజాను అందించబోతున్నారు. మే 20న ఎన్టీఆర్ నటించిన మూడు సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...
Ntr Movies Re Release: ఎన్టీఆర్ బర్త్డే ను ఈ సారి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తోన్నారు. కొత్త సినిమాల అప్డేట్స్తో పాటు అతడు నటించిన మూడు సూపర్ హిట్ సినిమాల్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన బ్లాక్బస్టర్ మూవీ సింహాద్రి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న రిలీజ్ కానుంది. 4కే, డాల్బీ అట్మాస్ సౌండ్ వెర్షన్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.
సింహాద్రి రీ రిలీజ్కు ముందు ఓ స్పెషల్ ఈవెంట్ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. సింహాద్రి సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపి దాదాపు 150కిపైగా థియేటర్లలో రీ రిలీజ్కానున్నట్లు తెలిసింది. అలాగే ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో రూపొందిన ఆది సినిమా మే 20న థియేటర్ల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఎన్టీఆర్కు మాస్ హీరోగా ఇమేజ్ను తీసుకొచ్చింది. సింహాద్రి, ఆదితో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని సినిమాను మే 19న థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూడు రీ రిలీజ్లతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న తాజా సినిమాకు సంబంధించి సర్ప్రైజ్ అప్డేట్ మే 20న రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఫస్ట్లుక్ను మే 20న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
టాపిక్