జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ మరో కొత్త ప్రయోగంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్స్ ఫిక్షన్, అడ్వెంచరస్ థ్రిల్లర్ కథాంశంతో కలియుగమ్ 2064 అనే సినిమా చేస్తోంది. ఈ మూవీలో కాంతార ఫేమ్ కిషోర్ కీలక పాత్రలో నటిస్తోన్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ బైలింగ్వల్ మూవీకి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్గా మే 9న తమిళ,తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది. కలియుగమ్ 2064 మూవీని తెలుగులో మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
కలియుగమ్ 2064 తెలుగు ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ రిలీజ్ చేశాడు. ట్రైలర్ లాంచ్ అనంతరం దర్శకుడు "రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. “ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫి,క్యారెక్టర్స్ డిజైన్. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్.. ఇలా అన్నీ ఒక మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ను కలిగించాయి” అని అన్నాడు.
భవిష్యత్తులో ముఖ్యంగా 2064 లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ఎమోషనల్గా ఈ మూవీలో చూపించారు. ఆహారం, నీరు దొరకని పరిస్థితుల్లో విచక్షణ కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే థీమ్ను ట్రైలర్లో చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే విధంగా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలను గుర్తుకుతెస్తోన్నాయి. ట్రైలర్లో కల్కి ప్రస్తావనం రావడం ఆసక్తిని పంచుతోంది. కల్కికి దీనికి ఏం సంబంధం లేదంటూ శ్రద్ధా శ్రీనాథ్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని పంచుతోంది.
కలియుగమ్ 2064 మూవీకి పి.సి.శ్రీరామ్ శిష్యుడు కె.రాంచరణ్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఇటీవల దిగ్గజ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా విడుదలచేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్కు చక్కటి ఆదరణ లభిస్తోన్నది మేకర్స్ పేర్కొన్నారు.
కెరీర్ ఆరంభం నుంచి టిపికల్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటోంది శ్రద్ధా శ్రీనాథ్. క్యారెక్టర్స్ పరంగా ప్రయోగాలు చేస్తోంది. జెర్సీ, సైంధవ్ సినిమాల్లో తల్లి పాత్రలో నటించింది. మెకానిక్ రాకీ మూవీలో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ చేసింది. కలియుగమ్ 2064లో శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు.
సంబంధిత కథనం