టాలీవుడ్ హీరో నితిన్ నటించిన రాబిన్హుడ్ చిత్రం చాలా అంచనాలతో వచ్చి పరాజయం మూటగట్టుకుంది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ కామెడీ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అనుకున్న రేంజ్లో కలెక్షన్లను సాధించలేకపోయింది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఇక రాబిన్హుడ్ చిత్రం ఓటీటీతో పాటు టెలికాస్ట్ అయ్యేందుకు కూడా సమయం ఆసన్నమైంది.
రాబిన్హుడ్ చిత్రం నేడే (మే 10) జీ5 ఓటీటీలో సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్కు రానుంది. నేడు అదే సమయానికి జీ తెలుగు టీవీ ఛానెల్లోనూ ప్రసారం కానుంది. “యాక్షన్ ప్యాక్డ్ నైట్కు రెడీగా ఉండండి. ఈరోజు నుంచే రాబిన్హుడ్ స్ట్రీమింగ్ అవనుంది” అని జీ5 ఓటీటీ నేడు ట్వీట్ చేసింది.
నేడు మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్లో రాబిన్హుడ్ మూవీ ప్రసారం కానుంది. అదే సమయానికి జీ5 ఓటీటీలోనూ స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఇదే తీరులో తీసుకొచ్చింది జీ సంస్థ. ఇప్పుడు రాబిన్హుడ్ విషయంలోనూ ఇదే ఫాలో అవుతోంది. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
హీరో నితిన్కు ఐదేళ్లుగా సరైన హిట్ లేదు. వరుస ప్లాఫ్లతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక ఈ రాబిన్హుడ్ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. భీష్మతో బ్లాక్బస్టర్ కొట్టిన నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో రావటంతో రాబిన్హుడ్పై అంచనాలు చాలా ఏర్పడ్డాయి. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ ఆ రేంజ్లోనే చేసింది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ డిజాస్టర్ అయింది. నితిన్ ఖాతాలో మరో ప్లాఫ్ చేరింది.
రాబిన్హుడ్ చిత్రం దాదాపు రూ.14కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం సుమారు రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది ఈ మూవీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించారు.
రాబిన్హుడ్ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేయడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇది కూడా ఈ మూవీకి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. కేతిక శర్మ స్పెషల్ సాంగ్లో చిందేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు.
నితిన్ ప్రస్తుతం తమ్ముడు సినిమా చేస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నితిన్కు జోడీగా కాంతార ఫేమ్ సప్తమి గౌడ నటిస్తున్నారు. ఈ చిత్రంతో అలనాటి హీరోయిన్ లయ మళ్లీ టాలీవుడ్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను దిల్రాజు నిర్మిస్తుండగా.. అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. తమ్ముడు చిత్రంపై నితిన్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.
సంబంధిత కథనం