నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్ చిత్రం ఉగాది పండుగకు రెండు రోజుల ముందు మార్చి 28న విడుదల కానుంది. ఈ యాక్షన్ కామెడీ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. గతంలో నితిన్ - వెంకీ కాంబోలో వచ్చిన భీష్మ ప్రేక్షకులను మెప్పించి భారీ హిట్ కొట్టింది. దీంతో రాబిన్హుడ్పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా టికెట్లు ఏపీలో అదనపు ధరతో ఉండనున్నాయి.
రాబిన్హుడ్ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు మేకర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్పై రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్కు రూ.75 ధరను అదనంగా పెంచేందుకు అనుమతిని ఇచ్చింది. సినిమా రిలీజయ్యే మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు అధిక ధరలకు ఓకే చెప్పింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది ఏపీ సర్కార.
రాబిన్హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలన్న మూవీ టీమ్ నిర్ణయం సరైనదేనా అనే డౌట్లు వినిపిస్తున్నాయి. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే అంతా సవ్యంగానే ఉండొచ్చు. కానీ మిక్స్డ్ టాక్ వస్తే అదనపు ధరలే మైనస్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. టాక్ తేడా కొడితే ధరల పెంపు వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వచ్చే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. అలాగే రిపీటెడ్ ఆడియన్స్ కూడా టికెట్ల పెంపుతో తగ్గే అవకాశాలు ఉంటాయి. దీంతో టికెట్ల పెంపు స్ట్రాటజీ రాబిన్హుడ్ చిత్రానికి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
రాబిన్హుడ్ చిత్రానికి సుమారు రూ.50కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనా. బడ్జెట్ పరంగా చూస్తే భారీ మూవీ కాదు. దీంతో టికెట్ల పెంపు ఈ చిత్రానికి కరెక్టేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తెలంగాణలో మాత్రం టికెట్ ధరలను పెంచే ఛాన్సే లేదు. తక్కువ బడ్జెట్తో రూపొందిన మ్యాడ్ 2 చిత్రం కూడా ఏపీలో టికెట్ల పెంపునకు అడుగుతున్నట్టు తెలుస్తోంది.
రాబిన్హుడ్ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంపై నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రమోషన్లను కూడా డిఫరెంట్గా జోరుగా చేస్తున్నారు. ఈ మూవీలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, దేవ్దత్ నాగే, షైన్ టామ్ చాకో కీరోల్స్ చేశారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్లో కనిపించనున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్కు వార్నర్ వచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసింది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చారు.
రాబిన్హుడ్ సినిమాకు ఓటీటీ డీల్ కూడా జరిగింది. జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ దక్కించుకుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం