Rimi Sen: ఫ్రెండ్ చేతిలో రూ.4కోట్లు మోసపోయిన చిరంజీవి హీరోయిన్: ఎలా జరిగిందో చెప్పిన నటి-rimi sen duped by friend over 4 crore she reveals the entire details of the case ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rimi Sen: ఫ్రెండ్ చేతిలో రూ.4కోట్లు మోసపోయిన చిరంజీవి హీరోయిన్: ఎలా జరిగిందో చెప్పిన నటి

Rimi Sen: ఫ్రెండ్ చేతిలో రూ.4కోట్లు మోసపోయిన చిరంజీవి హీరోయిన్: ఎలా జరిగిందో చెప్పిన నటి

Rimi Sen: నటి రిమి సేన్.. స్నేహితుడి చేతిలో భారీ మొత్తాన్ని మోసపోయారు. ఈ విషయం గతంలోనే బయటికి రాగా.. మోసం ఎలా జరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

Rimi Sen: ఫ్రెండ్ చేతిలో రూ.4కోట్లు మోసపోయిన చిరంజీవి హీరోయిన్: ఎలా జరిగిందో చెప్పిన నటి

Rimi Sen: నటి రిమి సేన్.. హిందీ, తెలుగు, బెంగాలీ భాషల్లో సినిమాలు చేశారు. బెంగాలీ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె 2001లో ఇదే ‘నా మొదటి ప్రేమ లేఖ’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టారు. హంగామ, ధూమ్, ధూమ్ 2, క్యూంకీ సహా చాలా బాలీవుడ్ చిత్రాల్లో రిమి సేన్ నటించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన అందరివాడు చిత్రంలో రిమి సేన్ హీరోయిన్‍గా నటించారు. కాగా, కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రిమి సేన్ ఓ స్నేహితుడి చేతిలో ఏకంగా రూ.4.14కోట్లు మోసపోయారు.

రోనక్ వ్యాస్ అనే స్నేహితుడి చేతిలో సుమారు మూడేళ్ల క్రితమే రిమి సేన్ ఈ మోసానికి గురయ్యారు. కేసు కూడా ఆమె పెట్టారు. ఈ కేసు మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చిందని రిమి సేన్ ఇప్పుడు తాజాగా ఈటీ టైమ్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిమి సేన్ వెల్లడించారు. అలాగే మోసం ఎలా జరిగిందో కూడా వివరించారు.

మోసం ఎలా జరిగిందంటే..

రోనక్ వ్యాస్ తనకు మూడు నాలుగేళ్ల క్రితం ముంబైలోని ఓ జిమ్‍లో కలిశాడని రిమి సేన్ చెప్పారు. క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని ఆమె చెప్పారు. అయితే ఆ తర్వాత వ్యాపారం చేద్దామని చెప్పి దశల వారీగా తన వద్ద డబ్బు తీసుకున్నాడని రిమి తెలిపారు. “ఓ బిజినెస్‍లో లాభాలు బాగా వస్తాయని అతడు నన్ను నమ్మించాడు. నేను ముందుగా నేను రూ.20లక్షలు ఇచ్చా. దానికి 9 శాతం వడ్డీ ఓ సారి ఇచ్చాడు. ఆ తర్వాత 12 నుంచి 15 శాతం వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. అలా దశల వారిగా రూ.4.14 కోట్లు ఇచ్చా. ఓసారి రూ.6లక్షల వడ్డీ ఇచ్చి ఆ తర్వాతి నుంచి కారణాలు చెప్పాడు. డబ్బు ఎగరగొట్టాడు. తనకు కరోనా వచ్చిందని, తండ్రికి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేవాడు” అని రిమి సేన్ వివరించారు.

స్కామ్ అని అర్థమైంది

క్లోజ్ ఫ్రెండ్ అయినందుకు తాను రోనక్‍ను చాలా కాలం నమ్ముతూ వచ్చానని రిమి సేన్ చెప్పారు. అయితే, అతడు మోసం చేస్తున్నాడని ఆ తర్వాత అర్థమైందని వెల్లడించారు. “డబ్బు ఇవ్వకుండా నెలలపాటు ఆలస్యం చేస్తుండటంతో అతడు స్కామ్ చేశాడని అర్థమైంది. ఇతర సిటీల్లోనూ కొందరిని మోసం చేశాడని తెలిసింది” అని రిమి సేన్ తెలిపారు.

తాను రోనక్ వ్యాస్‍పై ఏడాదిన్నర క్రితం ఖార్ పోలీస్ స్టేషన్‍లో ఎఫ్‍ఐఆర్ నమోదు చేశానని రిమి సేన్ తెలిపారు. అయితే, ఇటీవలే తనకు సీఐడీ నుంచి కాల్ వచ్చిందని వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కోసం తన లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారని వెల్లడించారు. రోనక్ ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అయితే అతడికి ఇండియాలో ఆస్తులేమీ లేనట్టు గుర్తించినట్టు రిమి సేన్ తెలిపారు. అతడు అన్ని ఆస్తులను తన తల్లి, భార్య పేర్లపై కొన్నాడని తెలిసిందని అన్నారు. అయితే, హైకోర్టులో చార్జ్ షీట్ నమోదైందని రిమి సేన్ తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

రిమి సేన్ చివరగా 2011లో షాగిర్ద్ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాతి నుంచి నటనకు దూరంగా ఉన్నారు.