Upasana Egg Freezing: మహిళలకు అదో ఇన్సూరెన్స్ పాలసీలాంటిది: తన అండాల ఫ్రీజింగ్‌పై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్-ram charan wife upasana konidela on her eggs freezing says it is like insurance policy for women ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Upasana Egg Freezing: మహిళలకు అదో ఇన్సూరెన్స్ పాలసీలాంటిది: తన అండాల ఫ్రీజింగ్‌పై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Upasana Egg Freezing: మహిళలకు అదో ఇన్సూరెన్స్ పాలసీలాంటిది: తన అండాల ఫ్రీజింగ్‌పై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Upasana Egg Freezing: రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన అండాలను ఫ్రీజ్ చేయడంపై ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మహిళలకు అదో ఇన్సూరెన్స్ పాలసీలాంటిదని ఆమె అనడం విశేషం. అమ్మతనం ఎప్పుడు కావాలో వాళ్లే తేల్చుకోగలరని చెప్పింది.

మహిళలకు అదో ఇన్సూరెన్స్ పాలసీలాంటిది: తన అండాల ఫ్రీజింగ్‌పై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Upasana Egg Freezing: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉపాసన కొణిదెల తన అండాలను ఫ్రీజ్ చేయించడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. పెళ్లి, అమ్మతనం, ఇతర అంశాలపైనా ఆమె స్పందించింది. మసూమ్ మీనావాలాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది.

అండాల ఫ్రీజింగ్‌పై ఏమన్నదంటే?

కెరీర్లో బిజీగా ఉండే చాలా మంది మహిళల ఈ మధ్యకాలంలో తమ అండాలను ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అమ్మ కావాలనుకున్న సమయంలో వాటిని తిరిగి ఉపయోగించుకుంటున్నారు. ఉపాసన కూడా అదే పని చేసింది. ఆమె అభిప్రాయం మేరకు అండం ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం అంటే మహిళలకు ఓ ఇన్సూరెన్స్ పాలసీలాంటిదేనట. అండం ఫ్రీజ్ చేయడంపై అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది.

“ఆ నిర్ణయం కఠినమైనదేమీ కాదు. అండాన్ని ఫ్రీజ్ చేసే ప్రక్రియ కష్టం కాదు. ఇది కేవలం సంతానం కోసమే అతని భావిస్తుంటారు. కానీ భద్రత కోసం కూడా దాచుకోవచ్చు. ఇదొక ఇన్సూరెన్స్ పాలసీలాంటిదే. ఓ మహిళ తనకు తాను ఇచ్చుకునే ఓ బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది. తన జీవితంలో ఎప్పుడు సంతానం కావాలనుకుంటుందో నిర్ణయించుకునే అవకాశం ఆమెకు దక్కుతుంది” అని ఉపాసన చెప్పింది.

మా ఫ్యామిలీయే నాకు చెప్పింది: ఉపాసన

పిల్లలను సాకేది మహిళలే కాబట్టి.. ఆ సంతానం ఎప్పుడు కావాలో నిర్ణయించుకునే హక్కు కూడా ఆమెకే ఉంటుందన్నది ఉపాసన వాదన. ఈ నిర్ణయం తీసుకునే ముందు తన కుటుంబం నుంచి తనకు ఎలాంటి అభ్యంతరాలు ఎదురు కాలేదని కూడా స్పష్టం చేసింది. “ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ కోసం నా కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్లే నేనీ నిర్ణయం తీసుకునేలా చేయడం నాకు ఆనందంగా అనిపించింది. కానీ కారా నాకు సహజంగానే జన్మించింది. ఇంకా సంతోషంగా ఉంది” అని ఉపాసన చెప్పింది.

మహిళలు వాళ్ల జీవితాలు, ఆర్థిక విషయాలను ఎలా చూసుకుంటారో ఈ ఎగ్ ఫ్రీజింగ్ కూడా అంతేనని ఉపాసన అభిప్రాయపడింది. “ఈ అండాలతో సైన్స్ ఎంతో చేస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటిని నిల్వ చేసి పెట్టుకుంటే మంచిది. నేను సైన్స్ ను నమ్ముతాను. నా అండాలను నిల్వ చేయడానికి నాకున్న అడ్డంకేంటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఈ విషయంలో సమాజం గురించి నేను పెద్దగా పట్టించుకోను” అని ఉపాసన తెలిపింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం