Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత మెగా పవర్ స్టార్‌కే ఆ ప్రాధాన్యత!-ram charan wax statue in madame tussauds singapore with his pet rhyme after queen elizabeth 2 will be unveiled in 2025 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత మెగా పవర్ స్టార్‌కే ఆ ప్రాధాన్యత!

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత మెగా పవర్ స్టార్‌కే ఆ ప్రాధాన్యత!

Sanjiv Kumar HT Telugu

Ram Charan Madame Tussauds Wax Statue In Singapore: రామ్ చరణ్ మైనపు బొమ్మను సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు. అయితే, ఇందులో ఓ స్పెషాలిటీ ఉంది. దాంతో క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత అంతటి ప్రాధాన్యత సాధించుకున్న స్టార్‌గా రామ్ చరణ్ నిలిచారు.

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత మెగా పవర్ స్టార్‌కే ఆ ప్రాధాన్యత!

Ram Charan Wax Statue In Madame Tussauds Singapore: గ్లోబల్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. దీంతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను చిరస్థాయిగా మార్చుకోనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

విశేషమైన సేవలకు

2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన చేశారు. చలనచిత్ర రంగానికి గ్లోబల్ స్టార్ చేసిన విశేషమైన సేవలకు, ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా రామ్ చరణ్‌కు "మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు"ని అందించారు.

ఆశ్చర్యపోయేవాడిని

సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టాత్మకమైన సూపర్‌స్టార్ల లైనప్‌లో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. "చిన్నప్పుడు అలా దిగ్గజ నటులను చూసి నేను ఆశ్చర్యపోయే వాడిని. ఏదో ఒక రోజు వారి మధ్య నేను కూడా ఉంటానని కలలో కూడా అనుకోలేదు. ఇది అద్భుతమైన అవకాశం. మేడమ్ టుస్సాడ్స్ ఇస్తున్న ఈ గుర్తింపు నా క్రాఫ్ట్ పట్ల కృతజ్ఞతతో ఉన్నాను" అని రామ్ చరణ్ తెలిపారు.

ముఖ్యమైన భాగం

రామ్ చరణ్ కటౌట్‌కి ఒక ప్రత్యేకమైన టచ్ జోడిస్తూ, రామ్ చరణ్ ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ కూడా ఈ మైనపు బొమ్మలో కలిసి ఉండటం విశేషం. దీంతో క్వీన్ ఎలిజబెత్ II కాకుండా, వారితో పాటు ఒక పెంపుడు జంతువుతో కూడిన మైనపు బొమ్మ కలిగిన ఏకైక సెలబ్రిటీగా చెర్రీ నిలవనున్నారు. "ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌లో రైమ్ నాతో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. రైమ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, నా వ్యక్తిగత జీవితంతో ఎంతో ముడిపడి ఉన్న అంశం" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

ప్రపంచ వేదికపై

2017లో ప్రారంభమైన ఐఫా, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ వేదికపై భారతీయ సినిమా వేడుకలను ఒకచోట చేర్చి, అభిమానులను తమ అభిమాన తారలతో ప్రత్యేకమైన రీతిలో నిమగ్నమయ్యేలా కొనసాగిస్తోంది.

ప్రపంచమంతా ప్రదర్శించడానికి

"ఐఫాతో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ప్రతిష్టాత్మకమైన భారతీయ సినిమా దిగ్గజాల శ్రేణికి రామ్ చరణ్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము" అని మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని గేట్‌వే ఆసియా రీజినల్ డైరెక్టర్ అలెక్స్ వార్డ్ అన్నారు. "ఈ భాగస్వామ్యం భారతీయ సినిమా ప్రభావాన్ని ప్రపంచమంతా ప్రదర్శించడానికి, మా అతిథులకు చిరస్మరణీయ అనుభవాలను అందించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది" అని తెలిపారు.

ఎవరెవరివీ ఉన్నాయంటే?

రామ్ చరణ్ మైనపు బొమ్మను పెట్టడం వలన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ఇప్పటికే ఉన్న "ఐఫా జోన్" మరింత బలోపేతం కానుంది. ఇందులో ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హీరోయిన్ కాజోల్, దర్శకనిర్మాత కరణ్ జోహార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ భారతీయ సినీ తారల బొమ్మలు ఉన్నాయి.

అయితే, పెంపుడు జంతువుతో రామ్ చరణ్ మైనపు బొమ్మను పెట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు.