Rajinikanth Kangana Ranaut: శనివారం ప్రారంభమైన కంగనా రనౌత్ కొత్త తమిళ మూవీ సెట్స్లో అనుకోని అతిథి సందడి చేశాడు. ఆ అతిథి మరెవరో కాదు రజనీకాంత్. తలైవర్ రజనీకాంత్ తనకు ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్ గురించి ట్విట్టర్ ద్వారా కంగనా రనౌత్ అభిమానులతో పంచుకున్నది. కంగనా రనౌత్, మాధవన్ కాంబినేషన్లో ఓ తమిళ మూవీ శనివారం ప్రారంభమైంది.
సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తలైవి ఫేమ్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. శనివారం పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు షూటింగ్ను మొదలుపెట్టారు. ఈ మూవీ సెట్స్ను రజనీకాంత్ విజిట్ చేశాడు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రజనీ కాంత్ తమ సెట్స్కు రావడంతో కంగనా రనౌత్, ఏఎల్ విజయ్తో పాటు యూనిట్ మొత్తం షాకయ్యారట.
గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రజనీకాంత్ సర్ప్రైజ్ విజిట్తో థ్రిల్లింగ్గా ఫీలైనట్లు కంగనా రనౌత్ ట్విట్టర్లో పేర్కొన్నది. రజనీకాంత్తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సంతోషకర సమయంలో మాధవన్ లేకపోవడం బాధను కలిగిచిందని కంగనా రనౌత్ తెలిపింది. త్వరలోనే మాధవన్ ఈ సినిమా షూటింగ్లో భాగం కాబోతున్నట్లు కంగనా తన ట్వీట్లో పేర్కొన్నది.
కంగనా రనౌత్, ఏఎల్ విజయ్ కాంబినేషన్లో గతంలో తలైవి సినిమా రూపొందింది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్గా నిలిచింది. కాగా కంగనా రనౌత్, మాధవన్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది కావడం గమనార్హం. గతంలో వీరిద్దరి కలిసి తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలు చేశారు.
టాపిక్