Vettaiyan: రజనీకాంత్ వేట్టయన్ మూవీ ఆన్లైన్లో లీకైంది. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హెచ్డీ ప్రింట్స్ పలు పైరసీ సైట్స్లో దర్శనమిస్తోన్నాయి. థియేటర్లలో నడుస్తుండగానే ఈ మూవీ ఆన్లైన్లో లీక్ కావడం కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది.
ఓటీటీలో రిలీజ్ కావడానికి ముందే రజనీకాంత్ మూవీ పైరసీ సైట్స్లో దర్శనమివ్వడానికి ఓవర్సీస్ ఓటీటీ కారణమని అంటున్నారు. ఓవర్సీస్లో శుక్రవారం ఏంథుసన్ ఓటీటీలో వేట్టయన్ మూవీ రిలీజైంది.
ఓవర్సీస్ ఓటీటీ ప్రింట్ను పైరసీ చేసినట్లు సమాచారం. ఇండియాలో మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ పైరసీ వారికి పెద్ద షాకిచ్చింది.
వేట్టయన్ మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజైంది. నెగెటివ్ టాక్తో సంబంధం లేకుండా థియేటర్లలో భారీగా వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికీ తమిళ, తెలుగు వెర్షన్ థియేటర్లలో ఆడుతోంది. అయినా పదిహేను రోజుల్లోనే ఓవర్సీస్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.
రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్స్ సినిమాను కూడా పదిహేను రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని, ఇలాగైతే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అంటున్నారు.
ఓవర్సీస్లో వేట్టయన్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడంతో ఇండియాలోనే అనుకున్నతేదీ కంటే ముందుగానే స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియాలో వేట్టయన్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. దీపావళి నుంచి తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వేట్టయన్ మూవీకి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా రజనీకాంత్ కనిపించాడు. అమితాబ్బచ్చన్తో పాటు ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు. రితికా సింగ్, మంజు వారియర్ హీరోయిన్లుగా కనిపించారు.
ఫేక్ ఎన్కౌంటర్స్తో పాటు విద్యా ఎలా బిజినెస్గా మారిందనే అంశాలకు కమర్షియల్ హంగులను మేళవించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.పోలీసులు హంటర్స్లా కాకుండా సొసైటీకి ప్రొటెక్టర్స్లా ఉండాలని చూపించాడు.
వేట్టయన్ మూవీ పదిహేను రోజుల్లో ఇండియావైడ్గా 250 కోట్ల గ్రాస్ను...140 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చేరుకోనట్లు సమాచారం.
వేట్టయన్ తర్వాత స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో కూలీ మూవీ చేస్తోన్నాడు రజనీకాంత్. కూలీలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. శృతి హాసన్ మరో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది.