Pushpa 2: The Rule: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఈ మూవీ ఆలస్యం అవుతుండడం నిరాశ కలిగించింది. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన పుష్ప 2 సినిమాను.. డిసెంబర్ 6వ తేదీకి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, పుష్ప 2 రిలీజ్ వాయిదా పడడం వల్ల నిర్మాతలపై అదనపు భారం భారీగా పడుతుందని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
‘పుష్ప '2: ది రూల్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ సుమారు నాలుగు నెలలు వాయిదా పడటంతో మేకర్లపై మరింత ఆర్థిక భారం పడుతోందని తెలుస్తోంది. వాయిదా వల్ల సుమారు రూ.40కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి అదనంగా ఖర్చు కానుందని ఈ మూవీ వర్గాలు చెప్పినట్టు ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. పుష్ప 2 సినిమా సుమారు రూ.350కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోందని అంచనా.
పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా సుమారు 50 రోజులు మిగిలి ఉంది. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేయనున్నారట. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా వేయకతప్పలేదు. అయితే, ఇప్పటికే ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్లను ఇంకా చాలా కాలం కొనసాగించాల్సి ఉంటుంది. కొందరు నటీనటుల డేట్లు కూడా వృథా అయ్యాయి. మళ్లీ వారిని కొత్తగా డేట్స్ అడగాలి. ఇలా నిర్మాతలకు సుమారు రూ.40కోట్ల వరకు అదనంగా బడ్జెట్ భారం పెరుగుతోందనే అంచనాలు బయటికి వచ్చాయి.
2021లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్బస్టర్ అయింది. దానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2: ది రూల్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ మూవీపై దర్శకుడు సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏ మాత్రం పొరపాట్లు లేకుండా అదనపు జాగ్రత్తలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. సుకుమార్ తీరుతోనే పుష్ప 2 వాయిదా తప్పలేదని టాక్. చెప్పిన విధంగా ఆగస్టు 15వ తేదీనే మూవీని రిలీజ్ చేయాలని అల్లు అర్జున్, నిర్మాతలు భావించినా.. దర్శకుడు సుకుమార్ మాత్రం సమయం కావాల్సిందేనని తేల్చిచెప్పారని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో తప్పనిపరిస్థితుల్లో రిలీజ్ను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది టీమ్.
ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వాలనేదే తమ లక్ష్యమని, షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో పుష్ప 2ను వాయిదా వేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. పుష్ప 2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జోడీగా రష్మిద మందన్నా హీరోయిన్గా చేస్తుండగా..ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, సునీల్ కీరోల్స్ చేస్తున్నారు.