Pushpa 2 Glimpse: గుడ్ న్యూస్.. పుష్ప 2 గ్లింప్స్ వచ్చేది ఆ రోజే!-pushpa 2 glimpse to come out on april 8th on the occasion of allu arjun birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pushpa 2 Glimpse To Come Out On April 8th On The Occasion Of Allu Arjun Birthday

Pushpa 2 Glimpse: గుడ్ న్యూస్.. పుష్ప 2 గ్లింప్స్ వచ్చేది ఆ రోజే!

Hari Prasad S HT Telugu
Mar 01, 2023 04:14 PM IST

Pushpa 2 Glimpse: గుడ్ న్యూస్.. పుష్ప 2 గ్లింప్స్ వచ్చేస్తోందని తాజాగా టాలీవుడ్ లో బజ్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గ్లింప్స్ తో సర్‌ప్రైజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Pushpa 2 Glimpse: టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న సినిమా పుష్ప: ది రూల్. 2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప: ది రైజ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి, కేజీఎఫ్ ల సీక్వెల్స్ రేంజ్ లో పుష్ప సీక్వెల్ కూడా ఉంటుందని, ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడం ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చిన అభిమానులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లింప్స్ వస్తోందన్న వార్త ఫ్యాన్స్ ను తెగ ఆనందానికి గురి చేస్తోంది. నిజానికి అవతార్ 2 మూవీని ప్రదర్శించే థియేటర్లలోనే పుష్ప: ది రూల్ గ్లింప్స్ వేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఫైనల్ కట్ పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడట. అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా వాళ్లు ఆశించిన రేంజ్ లో ఈ గ్లింప్స్ ఉండటానికి సుకుమార్ కొత్త ప్లాన్ తో సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ రామక్రిష్ణ వెల్లడించాడు. అంతేకాదు ఇప్పటికే పుష్ప 2 గ్లింప్స్ సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాడు.

ఈ గ్లింప్స్ ను బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ బజ్ క్రియేట్ అవుతోంది. గతడేది కేజీఎఫ్ 2 ఎవరూ ఊహించని సక్సెస్ సాధించిన తర్వాత పుష్ప సీక్వెల్ విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. మొదటి భాగంతోనే సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు సీక్వెల్ ను అంతకన్నా భారీగా చూపించడం సవాలే.

ఆ అంచనాలను సుకుమార్ ఎలా అందుకుంటాడన్నది ఆసక్తిగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా ఫస్ట్ పార్ట్ కంటే చాలా ఎక్కువగానే ఉంది. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కూడా తమ రెమ్యునరేషన్లను భారీగా పెంచేసినట్లు సమాచారం.

IPL_Entry_Point

సంబంధిత కథనం