Priyanka Chopra Remuneration For OTT Web Series: భారతదేశంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ను (OTT Platforms) విసృతంగా ఉపయోగిస్తున్నారు. ఓటీటీ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించేందుకు స్టార్ హీరో హీరోయిన్స్ సైతం రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే సినిమాల కంటే ఓటీటీ కంటెంట్కు వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ అని తెలుస్తోంది.
ఇంతకుముందు టీవీఎఫ్ వంటి గ్లోబల్ ఓటీటీలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి. కానీ, సెక్రెడ్ గేమ్ వెబ్ సిరీస్తో నెట్ఫ్లిక్స్, ఇన్సైడ్ ఎడ్జ్ సిరీస్తో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలు సైతం అంతర్జాతీయంగా భారీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాయి. దాంతో బాలీవుడ్ టు టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ సైతం ఓటీటీ బేస్డ్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
అంతేకాకుండా ఈ ఓటీటీల్లో నటించడానికి స్టార్స్ భారీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి అడిగినంత ఖర్చు చేసేందుకు ఓటీటీ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇలా ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకున్న ఇండియన్ హీరోయిన్గా ప్రియాంక చోప్రా నిలిచింది. బాలీవుడ్లో టాప్ హీరోల కంటే ఆమె పారితోషికం ఎక్కువగా ఉండటం విశేషం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నిర్మించిన సిటాడెల్ వెబ్ సిరీస్తో భారదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ప్రియాంక చోప్రా నిలిచింది. స్టార్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ను 250 మిలియన్ డాలర్ల (రూ. 2000 కోట్లకు పైగా) భారీ బడ్జెట్తో రూపొందించారు. ఈ సిరీస్కు ఇందులోని హీరోకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది ప్రియాంక చోప్రా.
తన జీవితంలో మొదటిసారిగా ప్రియాంక హీరోతో సమానంగా వేతనం పొందింది. షో కోసం ప్రియాంక చోప్రా, తన కో స్టార్ రిచర్డ్ మాడెన్ అందుకున్న కచ్చితమైన రెమ్యునరేషన్ తెలియదు. కానీ, సిటాడెల్లో నటించినందుకు ప్రియాంక, రిచర్డ్ ఒక్కొక్కరు సుమారు 25-30 మిలియన్ డాలర్స్ (రూ. 200-250 కోట్లు) తీసుకున్నట్లు అంతర్జాతీయ వాణిజ్య సైట్లు పేర్కొన్నాయి.
అంటే సిటాడెల్ కోసం ప్రియాంక తీసుకున్న పారితోషికం భారతదేశంలోని అత్యంత బడ్జెట్తో తెరకెక్కిన వెబ్ సిరీస్ హీరామండి కంటే ఎక్కువ అని తెలుస్తోంది. హీరామండికి మొత్తంగా రూ. 200 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇంతకుముందు ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక ఇండియన్ హీరోగా అజయ్ దేవగన్ (Ajay Devgn) ఉండేవాడు.
డిస్నీ ప్లస్ హాట్స్టార్ వెబ్ సిరీస్ రుద్ర: ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ కోసం అజయ్ దేవగణ్ రూ. 125 కోట్లు తీసుకున్నాడు. భారతదేశంలో ఓటీటీ ద్వారా అత్యధిక పారితోషికం పొందిన స్టార్గా అజయ్ నిలిచాడు. కానీ, ఇప్పుడు అతని స్థానాన్ని వెనక్కి నెట్టి ప్రియాంక చోప్రా ముందంజలోకి వచ్చింది. ఇక మిగతా నటీనటులు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఉదాహరణకు, మనోజ్ బాజ్పేయి (Manoj Bajpayee) ది ఫ్యామిలీ మ్యాన్ కోసం రూ. 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అలాగే కరీనా కపూర్ (Kareena Kapoor) జానే జాన్ కోసం 12 కోట్లు తీసుకోగా.. డార్లింగ్స్ కోసం అలియా భట్ (Alia Bhatt) రూ. 15 కోట్లు అందుకుంది. ఇక తాండవ్ వెబ్ సిరీస్లో తన పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) రూ. 25 కోట్లకుపైగా తీసుకున్నాడు. ఇతర నటీనటులతో చూస్తే సైఫ్ తీసుకున్నది ఎక్కువ మొత్తమే.
టాపిక్