Nayanthara Gold Movie: ట్రైలర్ , ప్రమోషన్స్ లేకుండానే నయనతార మలయాళం సినిమా రిలీజ్
Nayanthara Gold Movie: పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార జంటగా నటించిన గోల్డ్ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్గా సినిమాను విడుదల చేయడం దక్షిణాది వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Nayanthara Gold Movie: ప్రస్తుతం సినిమాకు ప్రమోషన్స్ కీలకంగా మారిపోయాయి. సినిమా ఎంత బాగున్నా ప్రమోషన్స్ లేకుండా సినిమా జనాల్లోకి తీసువెళ్లడం అసాధ్యంగా మారిపోయింది. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ను భారీ స్థాయిలో నిర్వహించి ప్రేక్షకుల్లో తమ సినిమా పట్ల క్యూరియాసిటీని కలుగజేస్తుంటాయి సినీ వర్గాలు. ప్రమోషన్స్ కోసం కోట్లలో ఖర్చు చేస్తుంటాయి.
కానీ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), నయనతార జంటగా నటించిన గోల్డ్ సినిమా యూనిట్ మాత్రం ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్గా సినిమాను రిలీజ్ చేసింది. డిసెంబర్ 1న (నేడు)ఈ సినిమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమమ్ ఫేమ్ ఆల్ఫాన్సో పుత్రేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ నో ప్రమోషన్స్ స్ట్రాటజీ ఫాలో కావడం దక్షిణాది సీన వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గోల్డ్ టీజర్ తప్ప ట్రైలర్ను రిలీజ్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు హీరోహీరోయిన్లు, దర్శకుడు రిలీజ్కు ముందు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియా ప్రమోషన్స్తోనే గోల్డ్ను విడుదలచేశారు. ఈ వారం మలయాళంలో రిలీజ్ అవుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం గమనార్హం. అంతే కాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ స్వయంగా గోల్డ్ సినిమాను నిర్మించారు. అయినా కూడా ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ప్రెస్మీట్ నిర్వహించలేదు.
ప్రమోషన్స్ చేయకపోవడం వెనకున్న స్ట్రాటజీ ఎవరికి అంతుపట్టడం లేదు. మలయాళంతో పాటు తమిళంలో ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. జోషి అనే ముబైల్ ఓనర్ కథ ఇది. అతడి జీవితంలో నాలుగు రోజుల్లో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనలతో ఈ సినిమాను ఆల్పాన్సో పుత్రేన్ తెరకెక్కించారు. రాధ అనే పాత్రలో నయనతార నటించింది. గురువారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్నది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆల్ఫాన్సో పుత్రేన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.