లవ్టుడే, డ్రాగన్ సినిమాలతో హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. డ్రాగన్ సక్సెస్ తర్వాత హీరోగా ఓ బైలింగ్వల్ మూవీ చేస్తోన్నాడు ప్రదీప్ రంగనాథన్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు డ్యూడ్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నాడు. ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకొని హీరో కనిపించడం ఆసక్తిని పంచుతోంది. డ్యూడ్ మూవీ 2025 దీపావళికి వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న డ్యూడ్ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్కు జోడీగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే మమితా బైజు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. సీనియర్ యాక్టర్ శతర్కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మోడ్రన్ స్టైల్లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఇదని సమాచారం.
డ్యూడ్ మూవీకి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ మూవీకి కూడా సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. డ్యూడ్ మూవీ తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించింది. 35 కోట్ల బడ్జెట్తో రూపొందిన రూపొందిన ఈ మూవీ 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రొమాంటిక్ డ్రామా మూవీలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహించాడు.
సంబంధిత కథనం