parampara season 2 trailer: అధికారమే నాయకుడిని వెతుక్కుంటూ వస్తుంది...పరంపర సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
కుటుంబ బంధాలకు పొలిటికల్ యాక్షన్ అంశాలను జోడించి రూపొందిన పరంపర వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. తాజాగా ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ జూలై 21న రిలీజ్ కానుంది. సోమవారం సీజన్ 2(parampara season 2) ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదలచేశారు.
పరంపర సీజన్ వన్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఫ్యామిలీ డ్రామాకు పొలిటికల్, యాక్షన్ అంశాలను జోడిస్తూ రూపొందిన ఈ సిరీస్ లో శరత్ కుమార్(sharath kumar), జగపతిబాబు(jagapathi babu) నటనతో పాటు కథలోని మలుపులు థ్రిల్ ను కలిగించాయి. తాజాగా ఈ సిరీస్ లో సెకండ్ సీజన్ రాబోతున్నది. ఈ నెల 21 నుండి డిస్నీ హాట్ స్టార్ లో(disney plus hotstar) స్ట్రీమింగ్ కానుంది. తాజాగా శుక్రవారం పరంపర సీజన్ 2 ట్రైలర్ ను అగ్ర హీరో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదలచేశారు. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ లో యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తులేదు అంటూ వచ్చే డైలాగ్ తో ఆసక్తికరంగా మొదలైంది. ఫ్రీడమ్ కోసం... మా నాన్న దగ్గర లాక్కున్న అధికారంకోసం...పోగోట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం... అన్నీ నాకు తిరిగా కావాలి అంటూ నవీన్ చంద్ర ఇంటెన్స్ గా చెప్పిన డైలాగ్ ఆసక్తిని పంచుతోంది. నిజాన్ని ఎక్కువ కాలం ఎవరు దాయలేరు బాబాయ్ అని జగపతిబాబు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. శరత్ కుమార్ తో నవీన్ చంద్ర సాగించిన పోరును ట్రైలర్ లో ఉత్కంఠను పంచుతోంది.
తండ్రి మాటకు పట్టించుకోకుండా శరత్ కుమార్ తో నవీన్ చంద్ర పోరుకు సిద్ధమవ్వడం, జగపతిబాబు అతడిని వారించడం లాంటి సీన్స్ అలరిస్తున్నాయి. ఫస్ట్ సీజన్ లో ఎమోషన్స్ ఎక్కువ ప్రాధాన్యతనివ్వగా రెండో భాగంలో మాత్రం యాక్షన్ రివేంజ్ అంశాలను హైలైట్ చేస్తూ రూపొందించినట్లుగా అనిపిస్తోంది. నవీన్ చంద్ర, ఆకాంక్షసింగ్, ఆమని ఈ సిరీస్ లో కీలక పాత్రలను పోషించారు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఎల్ కృష్ణవిజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్