ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ ప్లాన్ చేయండి. ముఖ్యంగా ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన ఈ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతున్నాయి. వీటిలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన కంటెంట్ ఉంది.
శుక్రవారం (అక్టోబర్ 10) జియోహాట్స్టార్ లోకి వచ్చిన మూవీ ఇది. తేజ సజ్జ లీడ్ రోల్లో నటించిన సినిమా. 'హను-మాన్' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ.. ఈ మిరాయ్ ద్వారా మరో ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ తో తిరిగి వచ్చాడు. పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని 'బ్లాక్ స్వోర్డ్' ఎలా దక్కించుకోవాలని చూస్తాడు.. ఒక అనాథ అయిన వేద ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే కథాంశంతో కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తీశాడు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్, రితికా శరణ్ వంటి వారు కూడా ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. గురువారమే (అక్టోబర్ 9) నెట్ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ దగ్గర విఫలమైనా.. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకే వచ్చిన మరో యానిమేషన్ వెబ్ సిరీస్ కురుక్షేత్ర. మహాభారత యుద్ధ నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళ మూవీ బాంబ్ కూడా ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చింది. బాంబ్ సినిమా డిఫరెంజ్ జోనర్ లో తెరకెక్కింది. మ్యాజికల్ రియలిజమ్ జోనర్ లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అంటే మ్యాజికల్ ఎలిమెంట్స్ తో కూడిన రియల్ వరల్డ్ లో జరిగే స్టోరీ ఇది. ఇందులో ఏది ఫిక్షన్, ఏది రియల్ అని కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది.
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నైనా అనే అమ్మాయి హత్య, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే సిరీస్ ఇది.
ప్రముఖ నటుడు సత్యరాజ్ ఇందులో సైకియాట్రిస్ట్ శ్యామ్ పాత్ర పోషించాడు. అతని మనవరాలు నిధి కనిపించకుండా పోవడంతో, వృద్ధుడైన శ్యామ్ పోలీసుల సహాయం కోరతాడు. అయితే దర్యాప్తులో సరైన ఆధారాలు దొరకకపోవడంతో, శ్యామ్ స్వయంగా నిధిని వెతకడానికి బయలుదేరుతాడు. ఈ సినిమా ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కన్నా రవి ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ వెబ్ సిరీస్ 'వేడువన్'. పావన్ ఈ థ్రిల్లింగ్ సిరీస్ను రాసి, దర్శకత్వం వహించాడు. ఒక బయోపిక్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర పోషించే అవకాశం పొందిన ఒక నటుడి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సిరీస్లో సంజీవ్ వెంకట్, శ్రవణిత శ్రీకాంత్, రమ్య రామకృష్ణ, రేఖా నాయర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
హారర్ సినిమా 'డిమాంటే కాలనీ 2' తర్వాత అరుళ్నిధి నటించిన 'రాంబో' అనే స్పోర్ట్స్ డ్రామా.. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. బాక్సింగ్ రింగ్లో అరుళ్నిధి ఉన్న పోస్టర్లో 'అపజయం ఎరుగని' అనే ట్యాగ్లైన్ ఉంది. ఈ చిత్రంలో తాన్య రవిచంద్రన్, అభిరామి వీటీవీ గణేష్ కూడా నటించారు. దర్శకుడు ముతయ్య ఈ స్క్రిప్ట్ను కూడా రాశారు. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చింది.
సంబంధిత కథనం