ఓటీటీల్లోకి ఈవారం చాలా చిత్రాలు క్యూ కట్టేందుకు రెడీ అయ్యాయి. వీటిలో ఆరు సినిమాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అయిన ఎల్2: ఎంపురాన్ ఈ వారం (ఏప్రిల్ నాలుగో వారం)లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రశంసలను పొందిన విక్రమ్ హీరోగా చేసిన చిత్రం కూడా స్ట్రీమింగ్కు రానుంది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న టాప్-6 సినిమాలు ఇవే.
మలయాళ స్టార్ హీరో మోహన్లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఎల్2: ఎంపురాన్ సినిమా ఈ గురువారం ఏప్రిల్ 24న జియోహాట్స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు రానుంది. ఈ మూవీకి పృథ్విరాజే దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఏప్రిల్ 24న హాట్స్టార్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లూసిఫర్ మూవీకి సీక్వెల్గా ఈ ఏడాది మార్చి 27న విడుదలైన ఎల్2 ఎంపురాన్ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించినట్టు మూవీ టీమ్ వెల్లడిందింది. దీంతో మలయాళ ఇండస్ట్రీలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ రికార్డు సాధించింది.
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూరన్: పార్ట్ 2 చిత్రం ఏప్రిల్ 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ పార్ట్ కంటే ముందు పార్ట్ 2 మేకర్స్ తీసుకొచ్చారు. ఈ యాక్షన్ డ్రామా మూవీకి ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. వీర ధీర శూరన్ పార్ట్ 2 మూవీని ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
జువెల్ తీఫ్ సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 25న నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్కు రానుంది. సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ హిందీ హిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రానికి కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఓ విలువైన డైమండ్ చోటీ చుట్టూ జువెల్ తీఫ్ మూవ సాగుతుంది.
తెలుగు కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్ కూడా ఈవారంలోనే స్ట్రీమింగ్కు రానుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అయితే, ఆ ప్లాట్ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి హిట్ అయింది. ఈ సీక్వెల్ మూవీకి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.
బాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం క్రేజీ (Crazxy) ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్కు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే, ఏప్రిల్ 25న రెంట్ తొలగిపోయి ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్లంతా ఫ్రీగా చూసేలా సాధారణ స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో స్క్రీన్పై సోహమ్ షా ఒక్కరే కనిపిస్తారు. మిగిలిన పాత్రల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఈ క్రేజీ మూవీకి గిరీశ్ కోహ్లీ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ప్రశంసలు దక్కించుకుంది.
సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రం కూాడా ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో పూర్తిస్థాయి స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవలే రెంటల్ విధానంలో వచ్చింది. అయితే, ఏప్రిల్ 25న ప్రైమ్ వీడియో యూజర్లందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాకు రీమా కగ్తి దర్శకత్వం వహించారు. థియేటర్లలో మోస్తరు వసూళ్లను ఈ చిత్రం సాధించింది. దర్శకుడి కావాలనుకునే ఓ యువకుడు తమ ఊర్లోనే స్నేహితుల సాయంతో ఓ చిత్రం తీయడం చుట్టూ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సాగుతుంది.
సంబంధిత కథనం
టాపిక్