మేలో వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో మరిన్ని తెలుగు చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్లో థియేటర్లలోకి వచ్చి నిరాశపరిచిన కొన్ని సినిమాలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. జాక్, ఓదెల 2తో పాటు మరిన్ని సినిమాలు స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. మేలో ఓటీటీల్లోకి రానున్న 5 ముఖ్యమైన తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్హుడ్ సినిమా మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్లాఫ్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాయి. మే తొలివారంలోనే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్కు రానుంది. డేట్ను త్వరలోనే జీ5 వెల్లడించనుంది. మే 2వ తేదీ లేకపోతే మే 5న జీ ఓటీటీలో రాబిన్హుడ్ స్ట్రీమింగ్కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ సినిమా కూాడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే తొలివారం లేకపోతే రెండో వారం ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుంది. జాక్ చిత్రంలో సిద్ధుకు జోడీగా హీరోయిన్గా నటించారు వైష్ణవి చైతన్య.
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లీడ్ రోల్ చేసిన ఓదెల 2 చాలా హైప్తో విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది. సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం పర్యవేక్షణ చేసిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రానికి అశోక్ తేజ డైరెక్షన్ చేశారు. ఈ సీక్వెల్ సినిమా ప్లాఫ్గా నిలిచింది. ఓదెల 2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మేలోనే స్ట్రీమింగ్కు వస్తుంది. డేట్ ఖరారు కావాల్సి ఉంది.
భారీ అంచనాలతో వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం కూడా కమర్షియల్గా డిజాస్టర్ అయింది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. సీనియర్ నటి విజయశాంతి కూడా ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ చేశారు. యాక్షన్, తల్లీకొడుకుల సెంటిమెంట్తో సాగే ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం కూడా మేలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే, ఇంకా సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీ తీసుకుందో సమాచారం బయటికి రాలేదు. త్వరలోనే సమాచారం వెల్లడి కావొచ్చు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్రూబా చిత్రం థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ ఈ ఏడాది మార్చి 14న విడుదలైంది. ఈ సినిమాకు విశ్వ కరణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు ఆహా ఓటీటీ దగ్గర ఉన్నట్టు సమాచారం. మేలో ఈ చిత్రం స్ట్రీమింగ్కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సంబంధిత కథనం