ఓటీటీలో దుమ్ము రేపుతున్న తొలి కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్.. ఐదు రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి-ott first kannada crime thriller web series ayyana mane clocks 50 million streaming minutes record on zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో దుమ్ము రేపుతున్న తొలి కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్.. ఐదు రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి

ఓటీటీలో దుమ్ము రేపుతున్న తొలి కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్.. ఐదు రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి వచ్చిన తొలి కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. ఐదు రోజుల కిందట వచ్చిన ఈ సిరీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో అప్పుడే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న తొలి కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్.. ఐదు రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి

ఓటీటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ తెలుగు సహా ఎన్నో భాషలకు చెందిన ఎన్నో వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. అయితే కన్నడ నుంచి మాత్రం ఈ మధ్య తొలి వెబ్ సిరీస్ వచ్చింది. అది కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో కావడం విశేషం. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఐదు రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.

కన్నడ వెబ్ సిరీస్ అయ్యన మనె

కన్నడలో రూపొందిన తొలి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు అయ్యన మనె. అంటే అయ్యన ఇల్లు అని అర్థం. ఈ సిరీస్ ఏప్రిల్ 25న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. తొలి ఐదు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు సొంతం చేసుకుంది. రమేష్ ఇందిర డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్ల పాటు సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ కేవలం 18 నుంచి 20 నిమిషాలే ఉండటం గమనార్హం.

ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కన్నడతోపాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రెండు భాషల్లోనూ ఈ సిరీస్ దూసుకెళ్తోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కావడంతో ఈ సిరీస్ ను ప్రేక్షకులకు బాగా ఆదరిస్తున్నారు.

అయ్యన మనె స్టోరీ ఏంటంటే?

అయ్యన మనె వెబ్ సిరీస్ జాజి (ఖుషీ రవి) అనే ఓ కొత్తగా పెళ్లయిన అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ. చిక్కమగళూరులోని ఓ ఇంట్లో సాగుతుంది. అయ్యన ఇంట్లోకి కొత్త కోడలిగా జాజి అడుగుపెడుతుంది. అయితే అప్పటికే ఆ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు కోడళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూస్తారు.

తమ ఇంటికి ఉన్న శాపం వల్లే ఇలా జరుగుతుందని ఆ ఇంట్లో వాళ్లు భావిస్తారు. మరో ముగ్గురు కూడా అలా చనిపోతారని వాళ్లు నమ్ముతారు. కానీ దీని వెనుక ఏదో పెద్ద రహస్యమే దాగి ఉందని జాజి అనుమానిస్తుంది. ఇంట్లో పనిమనిషి సాయంతో ఈ మరణాలపై ఆరా తీయడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి.

తర్వాత ఏం జరుగుతుంది? జాజి కూడా కన్నుమూస్తుందా? అంతకుముందు జరిగిన మరణాల గుట్టు రట్టు చేస్తుందా అన్నది తెలుసుకోవాలంటే ఈ అయ్యన మనె వెబ్ సిరీస్ చూడాల్సిందే. ప్రస్తుతానికి కన్నడ, హిందీల్లోనే సిరీస్ అందుబాటులో ఉంది. తెలుగులోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో మాన్సీ సుధీర్, విజయ్ శోభరాజ్ పవూర్, అనిరుధ్ ఆచార్య, అక్షయ్ నాయక్, హితా చంద్రశేఖర్, ఖుషీ చంద్రశేఖర్ లాంటి వాళ్లు నటించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం