పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి భారత సాయుధ దళాలు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. పాకిస్థాన్తో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ డ్రోన్లను, క్షిపణును ప్రయోగిస్తూ కవ్విస్తోంది. భారత్ దీటుగా ఎదుర్కొంటూ పాక్ను దెబ్బకొడుతూనే ఉంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు సాగుతున్నాయి. ఈ తరుణంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా అనౌన్స్ అయింది.
ఆపరేషన్ సిందూర్ ఆధారంగా రానున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయింది. ఈ పోస్టర్లో.. ఓ మహిళా సైనికురాలు ఓ చేతిలో గన్ పట్టుకొని ఉండగా.. మరో చేత్తో నిదుటిపై పెటుకుంటున్నారు. ముఖాన్ని మేకర్స్ రివీల్ చేయలేదు. ఆ సైనికురాలి ముందు యుద్ధ ట్యాంకర్లు, రగుతున్న మంటలు ఉన్నాయి. యుద్ధరంగంలోకి దిగే ముందు సైనికురాలు సిందూరం పెట్టుకుంటున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. భారత్ మాతాకీ జై అంటూ.. ఆపరేషన్ సిందూర్ టైటిల్ ఉంది.
ఆపరేషన్ సిందూర్ చిత్రాన్ని నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజినీర్ బ్యానర్లు నిర్మించనున్నాయి. ఉత్తమ్ మహేశ్వరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మిషన్ సిందూర్ జరిగిన విధానం, దేశభక్తి, సైనికుల వీరత్వం సహా మరిన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా కనిపిస్తోంది. ఈ చిత్రం కోసం నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆపరేషన్ సిందూర్ చిత్రాన్ని ప్రకటించడం సరి కాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై దర్శకుడు ఉత్తమ్ వివరణ ఇచ్చారు. ఎవరి సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు, కించపరిచడం తమ ఉద్దేశం కాదని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. మన దేశ సైనికులు, నాయకత్వం వీరత్వాన్ని, సామర్థ్యంపై సినిమా తీస్తామని అన్నారు. అయితే, ఇలాంటి సమయంలో మూవీ ప్రకటించడం కొందరిని నొప్పించి ఉండొచ్చని, వారికి క్షమాపణ చెబుతున్నానని ఉత్తమ్ రాసుకొచ్చారు.
పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు.. దాడికి తెగబడ్డారు. 26 మంది పర్యాటకులను చంపేశారు. దీనికి ప్రతిచర్యగా పాకిస్థాన్, వీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఆ మిషన్ నిర్వహించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.
సంబంధిత కథనం