మోహన్బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్లో పెదరాయుడు ఒకటి. 1995లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. డ్యూయల్ రోల్లో మోహన్బాబు అసమాన నటన... అతిథి పాత్రలో రజనీకాంత్ మేజరిజమ్స్ డైలాగ్స్, అద్భుతమైన పాటలు...వెరసి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షాన్ని కురిపించింది.
తమిళంలో విజయవంతమైన నాట్టమై రీమేక్గా పెదరాయుడు తెరకెక్కడం గమనార్హం. తమిళంలో కంటే తెలుగులోనే ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. పెదరాయుడు సినిమా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబోలో రావాల్సింది. కానీ రజనీకాంత్ వల్ల ఈ తండ్రీకొడుకుల కాంబో మిస్సయ్యింది.
సుందరకాండ, కొండపల్లి రాజా వంటి సినిమాలు నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ కేవీవీ సత్యనారాయణ...నాట్టమై సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా...రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. రీమేక్ రైట్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. నాట్టమై ప్రొడ్యూస్ ఆర్బీ చౌదరి కూడా కేవీవీ సత్యనారాయణకే రీమేక్ రైట్స్ అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. రీమేక్ రైట్స్కు డబ్బులు కూడా చెల్లించారట కేవీవీ సత్యనారాయణ.
రీమేక్ ఒప్పందాలపై సంతకం చేయడానికి ఆర్బీ చౌదరి సిద్ధమవుతోండగా...రజనీకాంత్ ఫోన్ చేసి తనకు నాట్టమై రీమేక్ రైట్స్ కావాలని ఆర్బీ చౌదరిని అడిగారట. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ అడగటంతో కేవీవీ సత్యనారాయణకు కాకుండా ఆయనకే రీమేక్ రైట్స్ అమ్మేశారు ఆర్బీ చౌదరి. రజనీకాంత్ ఫోన్ చేయకపోయుంటే ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబోలో పెదరాయుడు తెరకెక్కి ఉండేదని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత కేవీవీ సత్యనారాయణ అన్నారు. పెదరాయుడు సినిమా ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావడం గమనార్హం.
పెదరాయుడు సినిమాకు ముందు మోహన్బాబు చేసిన మూడు సినిమాలు ఫెయిలయ్యాయి. దాంతో ఈ సినిమాలో అతిథి పాత్ర చేయడమే కాకుండా సినిమా నిర్మాణంలో మోహన్బాబుకు రజనీకాంత్ సాయం చేశారు. పెదరాయుడు సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. సౌందర్య, భానుప్రియ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి కోటి మ్యూజిక్ అందించారు.
సంబంధిత కథనం