నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్యామల అందరిని పిలిచి వంట పోటీలకు అన్ని సిద్ధం చేసి పెడుతుంది. అందరూ అక్కడికి వస్తారు. కానీ, వంట పోటీలో శ్యామల ఒక కండిషన్ పెడుతుంది. పదినిమిషాల సమయంలోపు ఎవరైతే అద్భుతంగా రుచికరంగా వంట వండుతారో వాళ్లు ఈ పోటీలో గెలిచినట్లు అని శ్యామల చెబుతుంది.
అలాగే, గ్యాస్, ఆయిల్ రెండు వాడకుండా రుచికరంగా ఏదైనా పది నిమిషాల్లో వండాలి అని శ్యామల కండిషన్స్ చెబుతుంది. దానికి అంగీకరించిన శాలిని, చంద్రకళ ఇద్దరూ పోటీకి సిద్దమవుతారు. అలాగే తమకు నచ్చినట్టు వండటానికి రెడీ అవుతారు.
శాలిని శాన్విజిని వండుతానని, చంద్రకళ ముంత మసాలా వండుతానని చెబుతారు. ఇద్దరు వండుతున్న సమయంలో చంద్రకళని ఎలాగైనా ఇబ్బందుల్లో పెట్టి తన వంట చెడగొట్టాలని కామాక్షి, శ్రుతి ఇద్దరూ ప్రయత్నాలు చేస్తారు. చంద్రకళ దగ్గరికి వెళ్లి వంట చెడగొట్టేందుకు ప్రయత్నించి వాళ్లే కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు.
ఆ తర్వాత సమయం గడిచే కొద్దీ శాలిని, చంద్రకళ ఇద్దరూ తమకు నచ్చిన వంటలు రెండు ప్రిపేర్ చేసి పెడతారు. పోటీ తర్వాత ఆ రెండింటిని జగదీశ్వరి, శ్యామల ఇద్దరూ టేస్ట్ చేస్తారు. ఇద్దరి వంటలు కూడా బాగున్నాయని, రుచికరంగా ఉన్నాయని జగదీశ్వరి, శ్యామల చిన్న సస్పెన్స్ ఇచ్చి చెబుతారు. దాంతో మొదటి వంట పోటీలో చంద్రకళ, శాలిని ఇద్దరు తోడికోడళ్లు గెలుస్తారు.
తర్వాత పోటీ ఏంటో అని ఇద్దరు టెన్షన్ పడతారు. అనంతరం విరాట్ దగ్గరికి చంద్రకళ వెళ్లి నేను పోటీలో గెలవాలని కోరుకున్నావా బావ. శాలిని ఇంటిని మోసం చేయడానికి వచ్చింది. లేకుంటే నేను ఈ పోటీలో పాల్గొనేదాన్నే కాదు అని చెబుతుంది. కానీ, విరాట్ మాత్రం చంద్రకళ మాటలు వినడు, నమ్మడు. తాను చెప్పింది విరాట్ వినకపోవడంతో బాధపడుతుంది.
మరోవైపు శాలిని దగ్గరికి శృతి, కామాక్షి ఇద్దరు వస్తారు. వాళ్లొచ్చి నిలబడగానే శాలిని ఉండి మిమ్మల్ని చెడగొట్టడానికి పంపిస్తే దెబ్బలు తగిలించుకొని వచ్చారు సిగ్గు ఉందా అని తిడుతుంది. దానికి వాళ్లు మేం ప్రయత్నించాం. కానీ, ఫలితం రాలేదు అని శ్రుతి కామాక్షి చెబుతారు.
మీకు ఏ పని అప్పగించిన సరిగా చేయరు అనేసి వాళ్లను తిడుతుంది శాలిని. శ్యామల నెక్ట్స్ పోటీ ఏం నిర్వహిస్తుందో అని ముగ్గురు టెన్షన్ పడతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్