నిహారిక కొణిదెల(Niharika Konidela) 2016లో ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. మెగా డాటర్(Mega Daughter)గా ఆమెకు మంచి ఫేమ్ ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్స్'లో(Dead Pixels) తాజాగా నటించింది. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ను విడుదల అయింది. అయితే, సిరీస్ లో నిహారిక చెప్పే ఓ డైలాగ్ కారణంగా విమర్శలు వస్తున్నాయి.
మెగా డాటర్ తన ట్రైలర్ డైలాగ్లో 'నాకు బెడ్లో రోషన్, మనలో భార్గవ్ కావాలి' అని చెబుతుంది. దీంతో దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇస్తుందనే దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం అని మెగా అభిమానులు(Mega Fans) కొందరు అంటున్నారు. నిహారిక మంచి సక్సెస్ను చూడాలంటే అలాంటి డైలాగులు మానుకోవాలని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిహారిక డెడ్ పిక్సెల్స్(Niharika Dead Pixels) సిరీస్ను బాగా ప్రమోట్ చేస్తోంది. ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ డైలాగ్ల గురించి ఆమె ఏమి చెబుతుందో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిహారిక కొణిదెల, సాయిరోనక్, హర్షచెముడు ప్రధాన పాత్రల్లో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తోన్న ఈ సిరీస్ మే 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. బ్రిటన్ సిరీస్ డెడ్ పిక్సెల్స్ ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తోన్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్గా డెడ్ పిక్సెల్స్ సిరీస్ రూపొందుతోన్నట్లు తెలిసింది. ఈ సిరీస్లో గాయత్రి అనే నేటితరం యువతిగా నిహారిక కొణిదెల నటిస్తోంది.
ఇక ఆమె వైవాహిక జీవితం గురించిన విషయంలో ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కువ అయ్యాయి. విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పుష్ప 2(Pushpa 2) సినిమాలోనూ నిహారిక నటిస్తోందని న్యూస్ వైరల్ అయింది. ఇందులో మెగాడాటర్ నిహారిక నటిస్తుందనే వార్తతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ఆమె గిరిజన అమ్మాయిగా కనిపిస్తుందట. పోలీస్ ఇన్ ఫార్మర్ గా నటిస్తుందనే టాక్ నడుస్తోంది. అడవుల్లోకి పుష్ప వెళ్లాక.. గిరిజన యువతిగా పోలీసులకు సమాచారం ఇస్తుందట. పుష్పరాజ్ పక్కనే ఉంటూ.. ఈ పని చేస్తుందట. ఈ వార్తలో ఎంత వరకు నిజముందో చూడాలి.
అయితే ఇప్పటి వరకూ నిహారికను చూసినట్టుగా కాకుండా.. డిఫరెంట్ గా చూపించేదుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ పాత్రకు మెుదట సాయి పల్లవి(Sai Pallavi)ని సంప్రదించారట.. కానీ ఆమె తిరస్కరించడంతో నిహారికను సెలక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.