నిహారిక కొణిదెల నటించిన రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూడండి-niharika konidela naga shaurya movie oka manasu to stream on etv win ott from 9th october ott releases this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిహారిక కొణిదెల నటించిన రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూడండి

నిహారిక కొణిదెల నటించిన రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూడండి

Hari Prasad S HT Telugu

నిహారిక కొణెదల నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఏకంగా 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు ఓ మోస్తరు విజయం దక్కగా.. ఆ తర్వాత ఏ ప్రముఖ ఓటీటీలో కనిపించలేదు. మొత్తానికి ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.

నిహారిక కొణిదెల నటించిన రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఇక్కడ చూడండి

నిహారిక కొణిదెల, నాగశౌర్య జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా ఒక మనసు. ఈ సినిమా జూన్ 24, 2016లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ మూవీని ప్రీమియర్ చేయబోతోంది. ఇది ఒకరకంగా కాస్తా ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఒక మనసు ఓటీటీ రిలీజ్ డేట్

నిహారిక కొణిదెల మూవీ ఒక మనసు ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీని గురువారం (అక్టోబర్ 9) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

“ప్రతి మనసుకు దగ్గరయ్యే ఓ లవ్ స్టోరీ. ఒక మనసు మూవీ అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చూడండి” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మూవీలోని లీడ్ రోల్స్ పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

ఒక మనసు మూవీ గురించి..

ఒక మనసు అనేది 2016లో వచ్చిన ఓ రొమాంటిక్ డ్రామా. ఈ సినిమాను జీవీ రామ రాజు డైరెక్ట్ చేశాడు. మధుర శ్రీధర్ రెడ్డి, కృష్ణ భాటియా, అభినయ్ నిర్మించారు. ఈ సినిమాలో నాగ శౌర్య, నిహారికతోపాటు రావు రమేష్, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ అవసరాల, ఆర్జే హేమంత్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ఓ రాజకీయ నాయకుడి కొడుకు అయిన సూర్య, డాక్టర్ కావాలని కలలు కనే సంధ్య అనే అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ.

అయితే ఓ విషాదంలో ముగిసిన స్టోరీ. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇందులో సంధ్య అనే పాత్రలో నిహారిక నటించింది. ఈ మూవీకి ఐఎండీబీలోనూ కేవలం 4.9 రేటింగ్ మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకూ ఏ ప్రముఖ ఓటీటీలోనూ ఈ సినిమా అందుబాటులో లేదు. ఇప్పుడు ఈటీవీ విన్ ఈ సినిమాను తన ప్లాట్‌ఫామ్ లోకి తీసుకొస్తోంది. మరి ఓటీటీలో ఇన్ని రోజుల తర్వాత దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం